టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మంచి కమర్షియల్ సినిమాలు తీయడంలో దిట్టైన అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడం, అలానే మహేష్ బాబు కూడా ఇటీవల వరుసగా రెండు సక్సెస్ లు అందుకుని మంచి ఫామ్ లో ఉండడంతో, వీరిద్దరి ఫస్ట్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా తప్పకుండా బెస్ట్ హిట్ గా నిలుస్తుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. 

 

ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే బయటికొచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రాగా, యూట్యూబ్ లో రిలీజ్ అయిన మూడు సాంగ్స్ కు మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే సినిమా రిలీజ్ తరువాత సాంగ్స్ మరింతగా సక్సెస్ అవ్వడం ఖాయం అని మహేష్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 5న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం లో ఎంతో ఘనంగా నిర్వహించనుంది సినిమా యూనిట్. ఈ సందర్భంగా నాలుగు రోజుల క్రితం ఒక అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసారు. కాగా ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారని రెండు రోజలుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. 

 

అయితే కొంత ప్రత్యేమైన పని ఉండడంతో మెగాస్టార్ ఈ ఫంక్షన్ కు హాజరు కాలేనని చెప్పారని, కాగా ఈ ఫంక్షన్ కు ఆయన స్థానంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హాజరవుతున్నట్లు నేడు ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ హాజరవ్వగా, ప్రస్తుతం జరుగుతున్న సరిలేరు వేడుకకు చరణ్ హాజరవుతుండడం గొప్ప విశేషం అని చెప్పాలి. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: