సాయిధరమ్ తేజ్  హీరోగా ప్రతి రోజు పండగే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అందాల ముద్దుగుమ్మ రాశి కన్నా హీరోయిన్ గా.. సత్య రాజ్ కీలక పాత్రలో ప్రతిరోజూ పండగే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమాని దర్శకుడు మారుతి తెరకెక్కించగా..  గీత ఆర్ట్స్ యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా పై సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో  తనకు మంచి హిట్ వస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్నాడు. అయితే ఈ సినిమా నేడు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే  ఈ సినిమాపై ప్రేక్షకుల నుండి భిన్నమైన టాక్ వినిపిస్తోంది. కొంతమంది ఆవరేజ్ అంటే ఇంకొంతమంది బిలో ఆవరేజ్ అంటున్నారు. 

 

 

 అయితే దర్శకుడు మారుతి టేకింగ్ విషయంలో ప్రేక్షకులు కాస్త పెదవి విరుస్తున్నారు. ఈ సినిమాలో అంతా బాగున్నప్పటికీ సెకండాఫ్ లో మాత్రం ఎమోషన్ డోస్ పెంచి ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెట్టాడట మారుతి. ఎమోషనల్ డోస్ కాస్త తక్కువ ఉంటే సినిమా బాగుండేది అని సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న తాతను చివరి క్షణాల్లో హ్యాపీగా చూసుకునేందుకు విదేశాల నుంచి వచ్చిన మనవడిగా... తాత ను హ్యాపీ గా ఉంచేందుకు కుటుంబాన్ని అంతా ఒక్కచోట చేర్చేందుకు మనవడిగా సాయి ధరమ్ తేజ్ చేసే పెర్ఫార్మెన్స్ పరంగా అదిరిపోయినప్పటికీ... మారుతి టేకింగ్ మాత్రం సినిమాకు మైనస్ అయ్యేలా కనిపిస్తోంది. 

 

 

 అయితే గతంలో దర్శకుడు మారుతికి మంచి రికార్డు ఉంది. మహానుభావుడు బలే బలే మగాడివోయ్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు మారుతి. అటు ప్రేక్షకుల్లో కూడా మారుతి సినిమా అంటే ఒక మంచి కామెడీ కథ నేపథ్యం ఉంటుందని భావన.కాని  ఈ సినిమా విషయంలో మాత్రం మారుతి కొంత అజాగ్రత్తగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో గతంలో మంచి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు మారుతి... ప్రతి రోజు పండుగ సినిమా విషయంలో మాత్రం సాయి ధరంతేజ్ కు అన్యాయం చేసాడు అని ప్రేక్షకులు భావిస్తున్నారు . టేకింగ్ విషయంలో ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా మంచి హిట్ అయ్యేదని సినిమా చూసిన ప్రేక్షకులనుండి టాక్  వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: