అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు ఫేం భాస్కర్‌తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు, ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతం, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. పూజా హెగ్డే మరియు అఖిల్ కలిసి నటించడం ఇదే మొదటిసారి. తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అక్కినేని కోడలు సమంత అక్కినేని ఈ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. 

 

సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని తన ప్రేమకథను సమంతా అక్కినేనికి వివరిస్తారని, అక్కడ నుండి చిత్రం ప్రారంభం అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే తరహా విధానం మనం విజయ్ దేవరకొండ సినిమా 'గీత గోవిందం' సినిమాలో చూసాం. ఈ సినిమాలో విజయ్ తన ప్రేమ కథను నిత్యా మీనన్ కు చెప్పడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కినేని కోడలు సమంత అక్కినేనికి అఖిల్ "వదినా నేను ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాను ఎలాగంటే..." అంటూ సినిమా కథను మొదలుపెడతారు అంటూ సమాచారం.

 

అఖిల్ నటిస్తున్న ఈ సినిమాలో మొదటగా అతిధి పాత్రలో నటించడానికి వేరే నటిని అనుకున్నారు, కానీ ఈ చిత్రంలో కీలకమైన పాత్రకు సమంతా అక్కినేని అయితే బాగుంటుంది అని భావించి సమంతను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో సమంత నటిస్తున్నట్లు అధికారీకంగా ధృవీకరించలేదు. గతంలో సమంతా, అఖిల్‌ మనం సినిమాలో నటించారు. ఇప్పుడు మరోసారి వారు ఈ సినిమా కోసం కలిసి పనిచేయబోతున్నారు. అఖిల్ అక్కినేని ఇప్పటివరకు మూడు చిత్రాల్లో నటించారు, కానీ వాటిలో ఏవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఈ సినిమా అఖిల్ సినీ కెరీరుకు కీలకం కానుంది. బొమ్మరిల్లు సినిమా ఫేమ్ భాస్కర్ చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాతో మళ్ళీ దర్శకత్వం స్టార్ట్ చేశారు. భాస్కర్ గతంలో బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్ మరియు ఒంగోల్ గిత్త సినిమాలు తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: