మెగా అభిమానుల మనసు గెలుచుకున్న సాయి ధరమ్ తేజ్ ఎన్ని సినిమాలు ప్లాప్ ఆయిన్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతూనే ఉంటాడు. ఈ నేపథ్యంలోనే సినీ కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులు చుసిన సాయి ధరమ్ తేజ్ ఇటీవలే చిత్రలహరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అంతటి సూపర్ హిట్ చిత్రం తర్వాత తాజాగా 'ప్రతిరోజూ పండగే' సినిమాతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను అలరించేందుకు వచ్చేశాడు. 

                          

అయితే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో రాజమండ్రి వెటకారం భల్లే పండింది. అంటే దీన్ని బట్టి చూస్తే.. తెలుగు సినిమాల్లో గోదావరి యాసతో వచ్చే డైలాగులకు మంచి క్రేజ్ ఉంటుంది అని అర్థం అవుతుంది. గతంలో గోదావరి జిల్లాల యాసతో డైలాగులు ఇవివి సత్యనారాయణ సినిమాల్లో ఎక్కువగా కనిపించేవి. 

                       

ఆ తర్వాత మరో సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో కూడా గోదావరి యాస ఎక్కువగా ఉండేది. ఇక సీనియర్ దర్శకుడు వంశీ తెరకెక్కించిన సినిమాల్లో మాటలన్నీ గోదావరి యాసలో ఉండేవి అలాగే వంశీ సినిమాల్లో గోదావరి పల్లె అందాలు ప్రకృతి రమణీయత చక్కగా కనబడేది ఇప్పుడు ప్రతి రోజు పండుగ సినిమాలోనూ గోదావరి అందాలను మారుతి చక్కగా చూపించడంతో పాటు ఈ సినిమాలో డైలాగులు గోదావరి యాసలో వ్రాసుకున్నాడు. ఇవి సాయి ధరమ్ తేజ్ తో పాటు హీరోయిన్ రాశి కన్నా సినిమాలో నటీనటుల చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: