సింహ, లెజెండ్ సినిమాల తరవాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమాని ఇటీవలె పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్లో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.. ఈ సినిమాలో బాలకృష్ణ సరనస జెర్సీ మూవీ ఫేం శ్రద్ధా శ్రీనాద్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్గా, రోజా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. అలాగే బుల్లి తెర యాంకర్ రేష్మి గౌతం కూడా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
ఒక కీలక పాత్ర కోసం వెంకటేష్ ని బోయపాటి సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. తులసి సినిమా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చి మంచి విజయం సాధించింది. ఇక వెంకీ మల్టీస్టారర్లు చాలా చేశాడు కదా బాలయ్యతో కూడా నటిస్తాడని అందరూ భావిస్తున్నారు. ఇక వెంకటేష్ విషయానికి వస్తే ముందుగా మల్టీ స్టారర్లను మొదల పెట్టిందే ఆయన. ఇటు చిన్న హీరోలతో, అటు పెద్ద హీరోలతో కలిసి నటిస్తూ. మల్టీస్టారర్లో మంచి పేరు సంపాదించారు. ఇటీవలె విడుదలైన ఎఫ్2, వెంకీమామ రెండూ మంచి హిట్లు సాధించాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగే. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్లో మూడో సినిమ ాప్రారంభమైంది. ఈ సినిమాకు బి.గోపాల్ క్లాప్ కొట్టగా.. ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేసారు.