రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' సినిమా రూపొందింది. విభిన్నమైన కాన్సెప్ట్ తో నిర్మితమైన ఈ సినిమాలో రవితేజ సరసన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ .. నభా నటేశ్ .. తాన్యా హోప్ కథానాయికలుగా కనిపించనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమా నుంచి ఈ నెల 6వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

 

జనవరి 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఈ సినిమాలో ఆయనతో తలపడే ప్రతినాయకుడిగా బాబీసింహా కనిపించనున్నాడు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు సమానంగా వుండే ఈ సినిమా, రవితేజ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని దర్శక నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ చిత్రంలోని ‘ఢిల్లీవాలా..’ అనే గీతాన్ని  ఈరోజు (డిసెంబర్ 20) విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను ఆదిత్య అయ్యంగార్, గీతా మాధురి, రాహుల్ నంబియర్ పాడడం జరిగింది. హీరో పరిచయ గీతంగా విడుదలైన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. తమన్ తనదైన శైలిలో మెలోడీ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 


సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన తొలి పాట, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న  విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. సైన్స్‌ ఫిక్షన్‌తో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌గా, అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న చిత్రబృందం తెలిపింది. బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్య, సునీల్, రామ్‌కి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సంభాషణలు: అబ్బూరి రవి, ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని.

 

ముఖ్యంగా ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా లో సైన్స్ కు సంభందించిన ఎలిమెంట్స్ సరిగ్గా డీల్ చేయలేదని ఫీలవుతున్నట్లు స‌మాచారం. అయితే దీన్ని మ‌ళ్ళీ రీ షూట్ చేద్దామ‌ని అనుకుంటున్నాడ‌ని స‌మాచారం. రీ షూట్ అంటే నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్నారంట‌. కానీ ద‌ర్శ‌కుడు మాత్రం త‌న ప్రొడ‌క్ష‌న్ పై పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నాడ‌ని స‌మాచారం. కానీ రవితేజ ..ఈ విషయమై పట్టుపడుతున్న నేపధ్యంలో రీషూట్స్ పెట్టాలా వద్దా అనే విషయమై గత కొద్ది రోజులుగా డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్న‌ట్లు మీడియా స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: