టాలీవుడ్ లో ఈ మద్య వరుసగా మల్టీస్టారర్ మూవీలు వస్తున్న విషయం తెలిసిందే.  విక్టరీ వెంకటేష్ ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాన్, రామ్, వరున్ తేజ్ ఈ మద్య తన మేనళ్లుడు నాగ చైతన్యతో ‘వెంకిమామ’ మూవీలో నటించారు.  స్టార్ హీరోలను ఒకే తెరపై చూడటం ప్రేక్షకులకు కూడా ఆనందమే.  అయితే ఇప్పటి వరకు మెగా హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడటం చాలా రేర్ గా జరిగింది.  ఆ మద్య మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో క్లయిమాక్స్ లో పవన్ కళ్యాన్ కనిపించడం మెగా ఫ్యాన్స్ లో సంతోషాన్ని ఇచ్చింది.  అప్పటికీ పవన్ కి ఇంత క్రేజ్ లేకున్నా ఇద్దరు అన్నదమ్ములను ఒకే ఫ్రేమ్ లో చూడటం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.  మగధీర మూవీలో రాంచరణ్, చిరంజీవి ఒక సన్నివేశంలో కనిపిస్తారు. అయితే అవి కేవలం అతిథి పాత్రలకే పరిమితం అయ్యాయి.  

 

ఆ మద్య వంశి పైడిపల్లి తెరకెక్కించిన ఎవడు మూవీలో అల్లు అర్జున్, రామ్ చరణ్ లు నటించారు.. కాకపోతే ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించలేదు. తాజాగా ఇప్పుడు మెగా హీరోలు కలిసి నటించేందుకు సిద్దమవుతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లోటాక్ నడుస్తుంది. యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. దీని గురించి ఆల్రెడీ మేమిద్దరం చర్చించుకున్నాం అని అన్నారు. ఐతే కథ కోసం వెయిటింగ్ అని ఆయన చెప్పారు.  మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాన్ త్వరలో ‘పింక్’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.  

 

ఆ తర్వాత వరుసగా సినిమాలు తీసే అవకాశం ఉందంటున్నారు. ఆ మద్య పవన్ కళ్యాన్, రామ్ చరణ్ లు ఓ మల్టీస్టారర్ మూవీలో నటిస్తారని వార్తలు వచ్చాయి.. కాకపోతే  మంచి కథ ఓ టాలెంటెడ్ డైరెక్టర్ కోసం చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో మెగా హీరోలు ఒకే ఫ్రేమ్ లో తెరపై సందడి చేయొచ్చని టాలీవుడ్ టాక్.  అదే గనక జరిగితే మెగాఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: