సింగర్ సునీత అంటే తెలుగు సినిమా కు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు ఆమె అందరికి సుపరిచితురాలే ఆమె గొంతు కూడా ఆమె అందంగానే చాల బాగుంటుంది అలాగే ఆమెది తియ్యని గాత్రమే కాదు అందమైన రూపం కూడా ఆమె సొంతం. శృంగార భరిత పాట చాలు చాలు చాలు సరసాలు చాలు అని కొంటెపాటలు పాడినా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ అంటూ యుగళ గీతాలు పాడినా సునీత గాత్రంలో ఉండే మాధుర్యం అంత ఎంత కాదు మంత్రబుగ్దుల్ని చేస్తుంది అలాగే ఆమె పలికించే కొన్ని ఒరవదులు అబ్బో అనిపించక మానదు. అలాంటి సునీత కు కూతురు శ్రీయ ఆమె కూడా ఈ మధ్య సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఒక పాట కూడా పాడింది. ఆమె ఎన్నో కార్యక్రమాలలో ఎస్ పి బాలు గారికి ఏసుదాస్ గారితో కలిసి ప్రదర్శించిన ఆమె ప్రతిభ వారికి ఏమాత్రం తక్కువ అనిపించదు అంత బాగా పాడుతుంది. అయితే ఆమె నవ్వుతు బాగానే ప్రదర్శనలు ఇస్తున్న ఆ నవ్వులా వెనకాల చాల కష్టం దుఃఖం కూడా ఉంది.
వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ పైకి మాత్రం చిరునవ్వుతోనే కనిపిస్తుంది. సునీతకి 19 ఏళ్ల వయసులోనే పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త తీరుతో విసిగిపోయిన ఆమె చాలా ఏళ్లుగా అతడికి దూరంగా ఉంటూ వస్తోంది. ఏది తెలిసిన మీడియా వారు ఎన్నోసార్లు మీరు ఒంటరిగా ఎందుకుంటున్నారు అని మళ్ళిపెళ్లిచేసుకుంటారా అని అడిగిన ప్రశ్నలకు సమాధానం దీనికి ఆమె ఎప్పుడూ లేదనే సమాధానం ఇచ్చేవారు. కానీ గత కొన్నాళ్లుగా ఆమె పెళ్లి విషయం లో ఎప్పుడు లేదు అని సమాధానము చెప్పే సునీత ఇప్పుడు ఆమె మళ్ళి పెళ్లి చేసుకుంటుంది అని తనకు కాబోయే భర్త ఐటీ కంపెనీ యజమాని అని, ఆయన కూడా ఇదివరకే విడాకులు తీసుకున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఈ విషయమై సునీతను అడిగిన ఒక మీడియా సభ్యుడు ఆమె ప్రస్తుతానికి తనకు రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదనీ కుండబద్దలు కొట్టేసింది. తనను అభిమానించి తన బాగు కోరుకునే వారందరికీ ఒకటే చెప్పదల్చుకున్నానని. తాను చాలా ప్రైవేట్ పర్సన్ అని చెప్పుకొచ్చింది. తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన సమాచారాన్ని తానే చెప్పాలని అనుకుంటానని, ఇప్పుడు తానే చెబుతున్నా. అటువంటిది ఏది లేదని క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికైనా ఈ రూమర్స్ ఆపేయండని కోరింది. నా కూతురు శ్రీయ కూడా మంచి సింగర్ అని ఇటీవల ఒక సినిమాకు పాడింది అని ఆమె మంచి సింగర్ మాత్రమే కాదు ఓ మంచి పనికోసం శ్రియ, ఆమె స్నేహితులందరూ కలిసి లక్ష రూపాయలను పోగు చేసి సీఎం రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేశారు అని సింగర్గానే కాకుండా మంచి మనసున్న మనిషిగా శ్రియా నిరూపించుకుంటోంది అని ప్రశంసించింది.