టాలీవుడ్, కోలీవుడ్ లో మహానటి మూవీలో సావిత్రి పాత్రకు జీవం పోసిన నటి కీర్తి సురేష్ విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.  ఈ మూవీలో కీర్తికి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి.  తెలుగు లో రామ్ పోతినేని నటించిన ‘నేను శైలజ’ మూవీతో పరిచయం అయ్యింది.  ఆ వెంటనే నేచురల్ స్టార్ నాని నటించిన ‘నేను లోకల్’ తో మరో సూపర్ హిట్ అందుకుంది.  ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ మూవీతో కీర్తి సురేష్ తెలుగు, తమిళ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది.  తెలుగు, తమిళ్ లోనే కాదు హిందీలోనూ తన సత్తా చాటబోతుంది.  ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తున్న కీర్తి సురేష్ తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ 168 వ సినిమాలో నటించబోతున్నట్లు ఇటీవల ఓ పోస్ట్ ద్వారా తెలిపింది. 

 

తాను చిన్ననాటి నుంచి ఎంతగానో అభిమానిస్తున్న సూపర్ స్టార్ తో కలిసి నటించే అదృష్టం తనకు దక్కినందకు ఎంతో ఆనందంలో మునిగిపోతున్నానని పోస్ట్ చేసింది.  అయితే ఈ మూవీలో రజినీ సరసన హీరోయిన్ గా నటిస్తుందా? లేదా వేరే పాత్రలో నటిస్తుందా అన్న విషయం అభిమానుల్లో ఎన్నో సందేహాలు వచ్చాయి.  అయితే కోలీవుడ్ టాక్ ప్రకారం ఈ మూవీలో రజినీకాంత్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారట.  అయితే కీర్తి సురేష్ రజినీ తల్లికి లేటుగా జన్మించడం..ఆమె ఆలనా పాలనా రజినీకాంత్ చూసుకోవడం జరుగుతుందని కథనాలు వస్తున్నాయి. 

 

సూపర్ ఫార్మ్ లో ఉన్న కీర్తి సురేష్ రజిని చెల్లిగా నటిస్తుందా.. అనేది ఆసక్తిగా మారింది. అలాగే రజిని డ్యూయల్ రోల్ చేస్తుండగా ఓ పాత్రకు హీరోయిన్ గా ఆమె నటిస్తున్నారంటూ మరో వాదన కూడా నడుస్తుంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న రంగ్ దే మూవీలో నటిస్తున్నారు.  ఇ

మరింత సమాచారం తెలుసుకోండి: