టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుండి బయటకు వచ్చిన మూడు సాంగ్స్ మరియు టీజర్, సినిమాపై భారీగా అంచనాలు ఏర్పరిచాయి. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 11న రీరిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జనవరి 5న జరగనుండగా, 

 

ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచేస్తున్నట్లు సరిలేరు యూనిట్ నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇక మరొకవైపు అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో సినిమా కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతోంది. మంచి స్టైలిష్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే సరిలేరు ప్రీ రిలీజ్ యూనిట్ వారు మెగాస్టార్ ను ప్రత్యేక అతిథిగా పిలవనున్న నేపథ్యంలో, తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆర్ఆర్ఆర్ హీరోలైన ఎన్టీఆర్

 

రామ్ చరణ్ లను ప్రత్యేక అతిథులుగా అల యూనిట్ ఆహ్వానించనుందని, మరొక రెండు రోజుల్లో ఈ విషయమై వారి నుండి అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని వార్తలు గట్టిగా వినపడుతున్నాయి. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, సరిలేరు టీమ్ కి అలవైకుంఠపురములో టీమ్ గట్టిగా పోటీ ఇచ్చినట్లే. మరి సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ రెండు సినిమాల్లో ఏది సక్సెస్ అవుతుందో చూడాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: