టాలీవుడ్ లో ఈ మద్య యాంకర్లు నటీమణులుగా మారుతున్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా జబర్ధస్త్ కామెడీ షో తో యాంకర్లుగా పరిచయం అయిన అనసూయ, రష్మీ గౌతమ్ లు నటీమణులుగా మారుతున్నారు.  రష్మీ ఇప్పటి వరకు కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ సాధించలేక పోయింది.  అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ లో కూాడా కనిపిస్తుంది.  ఇక జబర్ధస్త్ లో యాంకర్ గా పరిచయం అయిన అనసూయ తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించింది.  దాంతో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా మూవీతో సందడి చేసింది.  ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా.. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ మూవీలో అనసూయ రంగమ్మత్త పాత్రలో కనిపించింది. 

 

ఈ పాత్రకు అనసూయ మంచి న్యాయం చేసిందని మంచి ప్రశంసలు దక్కాయి.  తాజాగా ఇప్పుడు క్రియెటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి దర్శకత్వంలో అనసూయ మరో మూవీలో నటిస్తుంది.   ఆతర్వాత ఈ భామకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ఇప్పుడు ఆమె ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమైంది. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ మూవీలో అనసూయ నటించనుంది.  ఈ విషయాన్ని స్వయంగా దర్శకులు కృష్ణవంశే చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఓ పోస్ట్ లో ఎప్పుడూ నవ్వుతూ ఉండే అనసూయతో పనిచేయడం సంతోషంగా ఉంది.

 

ఆమె ఓ స్పైసీ పాత్రలో కనిపించబోతోంది అని ట్వీట్ చేశాడు.  ఇప్పటి వరకు అనసూయ నటించిన సినిమాలు రంగస్థలం ఒక్కటే మంచి పేరు తెచ్చింది.  ఇక రంగమార్తండ మూవీ మరో స్టేజ్ కి తీసుకు పోతుందని ఆయన అభిప్రాయ పడుతున్నారు.  ప్రస్తుతం జబర్దస్త్ లో నటిస్తునన అనసూయ ఓవైపు యాంకరింగ్ చేస్తు మరికొన్ని ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: