తెలుగు లో వస్తున్న కామెడీ షో జబర్ధస్త్ ఎంత ఆదరణ వస్తుందో అందరికీ తెలిసిందే.  ఏడేళ్ల క్రితం ప్రారంభంమైన జబర్ధస్త్ ఎంతోమంది ప్రేక్షకుల మనసు దోచింది.  ఇక్కడి తెలుగు ప్రజలకే కాదు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ జబర్ధస్త్ ని ఇష్టపడుతున్నారు.  ఇందులో పాపులర్ అయిన కొంత మంది కమెడిన్లు వెండి తెరపై కూడా వెలిగిపోతున్నారు.  ప్రస్తుతం కమెడియన్లు ఎవరంటే అంత జబర్ధస్త్ నుంచి వచ్చినవారే అని చెబుతారు.  ఇక జబర్ధస్త్ లో ఏడేళ్లుగా జడ్జీగా వ్యవహరిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం ఇందులో నుంచి వెళ్లిపోయారు.  ఎమ్మెల్యే, నటి రోజా ఒక్కరే జడ్జీగా వ్యవహరిస్తున్నారు. 

 

ఈ మద్య వస్తున్న ప్రోమోలో స్టార్ కమెడియన్ పోసాని కృష్ణమురళి జడ్జీ స్థానంలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం నాగబాబు జీ తెలుగు లో వస్తున్న అదిరింది కామెడీ షోకి జడ్జీగా వ్యవహరిస్తున్నారు.   నాగబాబు వెళ్లిపోయిన తర్వాత షో రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. మెగా బ్రదర్ వెళ్లిన తర్వాత కూడా షో రేటింగ్ పడిపోకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు మల్లెమాల టీం. ముఖ్యంగా నాగబాబు లేని లోటు భర్తీ చేయడానికి ప్రతివారం హీరోలనే జడ్జిలుగా తీసుకొస్తున్నారు. ఇదిలా ఉంటే నాగబాబుతో పాటు చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ లాంటి వాళ్లు వెళ్లిపోయారు. చంద్ర టీంలో చాలా రోజుల నుంచి కామెడీ చేస్తున్న సత్తిపండుకు ప్రమోషన్ వచ్చింది. ఈయన ఇప్పుడు టీం లీడర్ అయ్యాడు.

 

వ్యంగ్యమైన కామెడీతో కడుపుబ్బా నవ్వించేందుకు తిప్పలు పడుతున్నారు.  సుడిగాలి సుదీర్, హైపర్ ఆది, అవినాష్ ఇలా కొంత మంది తమదైన కామెడీతో అలరిస్తున్నారు. ఇక ఆర్పీ టీంలో సెకండ్ లీడ్ చేస్తున్న మహిధర్ కూడా ఇప్పుడు టీం లీడర్ అయిపోయినట్లు తెలుస్తుంది. వచ్చేవారం కొత్త ప్రోమోలో ఈ ఇద్దర్నీ బాగానే హైలైట్ చేసారు. జబర్ధస్త్ షో రేటింగ్‌పై మాత్రం ప్రభావం పడకూడదని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు నిర్వాహకులు. ఇది చాలా వరకు సక్సెస్ అవుతుంది కూడా. నాగబాబు వెళ్లిపోయిన తర్వాత కూడా రేటింగ్స్ మాత్రం అలాగే వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: