ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించే సినిమా దాదాపు ఖరారైంది. అయితే ఇందులో చెర్రీ హీరో కాదు. గెస్ట్ రోల్ మాత్రమే పోషిస్తున్నాడు. అతిథి పాత్రలో నటించే మూవీ తర్వాత హీరోగా నటించే రెండు సినిమాలను లెైన్ లో పెట్టాడు ఈ మెగా హీరో. 

 

ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ సినిమాను ఎనౌన్స్ చేయకపోయినా.. దాదాపుగా కన్ఫార్మ్ అయింది. చిరంజీవి, కొరటాల సినిమాలో తండ్రీ కొడుకులు నటిస్తున్నారన్న వార్త చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని చిత్రవర్గాలు కన్ఫార్మ్ చేయకపోయినా.. ఇందులో.. అతిథి పాత్రలో కనిపించనున్నాడు. గెస్ట్ రోల్ అనే పేరేగానీ.. సినిమాలో చెర్రీ ఎక్కువసేపే కనిపిస్తాడట.  

 

చిరంజీవి, కొరటాల సినిమాలో రామ్ చరణ్ నటించడంతో.. మెగాఫ్యాన్స్ ఎగ్జయిట్ మెంట్ గా ఫీలవుతున్నారు. ఈ ఇద్దరూ కలిసి మూడు సినిమాలు చేసినా.. రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర, బ్రూస్ లీలో చిరంజీవి గెస్ట్ రోల్ లో తళుక్కుమన్నాడు. ఖైదీ నంబర్ 150లో ఓ పాటలో రామ్ చరణ్ మెరవగా.. ఈ సారి నిడివి ఎక్కువున్న పాత్ర పోషిస్తున్నాడు.  

 

రామ్ చరణ్ సోలో హీరోగా నటించే సినిమా కన్ఫార్మ్ కాకపోయినా.. తర్వాతి మూవీ మాత్రం చిరంజీవి, కొరటాల సినిమానే. ఫిబ్రవరి నాటికి ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో చెర్రీ పాత్ర పూర్తవుతుంది. దీని తర్వాత కొరటాల సినిమాలో జాయిన్ అవుతాడు. ఈ లోగా... స్క్రిప్ట్ లు వింటున్న రామ్ చరణ్ హీరోగా నటించే మూవీని పైనల్ చేస్తాడు. మొత్తానికి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తర్వాత మూవీపై మెగాఫ్యాన్స్ ఎంతో ఆసక్తి పెంచుకుంటున్నారు. తన రోల్ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ వారిలో నెలకొంది. మరి రామ్ చరణ్ ఏ కథతో రూపొందుతున్న సినిమాలో వస్తాడో చూడాలి. 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: