టాలీవుడ్ సినిమా పరిశ్రమకు నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఛలో అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన్న, ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ హిట్ అందుకుంది. ఆ తరువాత టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి గీత గోవిందంలో నటించి మరొక సెన్సేషనల్ హిట్ ని అందుకున్న ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పలు పెద్ద సినిమా అవకాశాలతో ముందుకు దూసుకెళ్తోంది. ప్రస్తుతం మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా రష్మిక నే హీరోయిన్. 

 

మొదట కన్నడ సినిమా కిర్రాక్ పార్టీ తో అక్కడ మంచి పేరు సంపాదించిన రష్మిక, ఆ సినిమా హీరో అయిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. అనంతరం వారిద్దరూ 2017లో నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. అయితే అనూహ్యంగా ఏమిజరిగిందో ఏమో కానీ, మేమిద్దరం విడిపోతున్నాం అంటూ వారు ప్రకటించడం జరిగింది. అయితే తామిద్దరికీ సినిమాల పరంగా చాలా భవిష్యత్తు ఉందని, అందుకే విడిపోతున్నాం అని రష్మిక అప్పట్లో చెప్పడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం రక్షిత్ శెట్టి, అతడే శ్రీమన్నారాయణ అనే భారీ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. 

 

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక తో బ్రేకప్ పై స్పందించిన రక్షిత్, మన జీవితంలో ఒక్కోసారి జరిగే మంచి కానీ, లేదా చెడు గాని మనల్ని రకరకాల భావోద్వేగాలకు గురిచేస్తుందని, అయితే మనం వేటినీ కూడా పెద్దగా లెక్క చేయకుండా, అంతా మన మంచికే అనుకోవడంతోపాటు, అలానే అవి మనకు ఒక గుణపాఠం అనుకుంటూ ముందుకు సాగితేనే కానీ జీవించలేం అని రక్షిత్ అన్నారు. రష్మికతో కలయిక మరియు బ్రేకప్ రెండూ కూడా యాదృచ్చికంగా జరిగాయని, తానుగా అదే విషయాన్నీ పదే పదే తలుచుకోనని, తనకు భవిష్యత్తు గురించే ఎప్పుడూ ఆలోచన ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం తమ బ్రేకప్ పై రక్షిత్ చేసిన కామెంట్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: