సాయి తేజ్ హీరోగా మారుతి డైరక్షన్ లో వచ్చిన సినిమా ప్రతిరోజూ పండగే. గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో సాయి తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అయ్యింది. లాస్ట్ ఫ్రైడే రిలీజైన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. వసూళ్లు కూడా బాగా వస్తున్నాయి.

 

సినిమా థ్యాంక్స్ మీట్ కు పరుచూరి గోపాలకృష్ణ వచ్చారు. ఈ సినిమా తాను చూసి ఈ సక్సెస్ మీట్ కు వచ్చానని. మారుతి చాలా గొప్పగా ఈ సినిమా చేశాడని. ఈ సినిమాలో జరిగినట్టుగా తన తల్లి కూడా హార్ట్ ఎటాక్ వచ్చి మరికొద్ది గంటలే అని డాక్టర్ చెప్పగా నేను అన్నయ్య రావడంతో ఆమె ఏడాదిన్నర బ్రతికారని గుర్తుచేసుకున్నారు. దాసరి తాతా మనవడు.. వెంకటేష్ కలిసుందాం రా.. తేజ్ ప్రతిరోజూ పండగే సినిమా అని ఈ సినిమాను వాటితో పోల్చారు గోపాలకృష్ణ.

 

సినిమాలో ప్రతి సన్నివేశం చాలా బాగుందని. సినిమాలో నటించిన నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని అన్నారు పరుచూరి గోపాల కృష్ణ. సినిమా థ్యాంక్స్ మీట్ కు సుకుమార్ కూడా గెస్ట్ గా వచ్చారు. సినిమా సక్సెస్ అవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. చిత్రలహరితో హిట్ ట్రాక్ లోకి వచ్చిన సాయి తేజ్ ప్రతిరోజూ పండగే సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 

 

ప్రతిరోజు పండగే సినిమాలో సాయి తేజ్ సరసన రాశి ఖన్నాహీరోయిన్ గా నటించింది. ఆల్రెడీ సుప్రీమ్ సినిమాతో హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ మరోసారి హిట్ కొట్టారు. ఈ సినిమా తర్వాత సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను సుబ్బు అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: