టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 70శాతం పూర్తయింది. మిగతా 30 శాతం షూటింగ్ను జనవరి నుంచి మొదలు పెట్టనున్నట్లు సమాచారం. తాజాగా ఈ షూటింగ్కి సంబంధించి రాజమౌళి ఇద్దరు హీరోలకి ఆంక్షలు విధించినట్లు సమాచారం. జనవరి నుంచి షూటింగ్ జరిగేలా రాజమౌళి ప్లాన్ చేశాడు. ఇకనుంచి మాటిమాటికి హైదరాబాద్ వెళ్ళవద్దని ఎన్టీఆర్ రామ్ చరణ్ కు కండిషన్ పెట్టేసాడు. అవి ఏంటంటే... షూటింగ్ కంప్లీట్ అయ్యేంతవరకు సెట్ నుంచి బయటకు వెళ్ళటం కుదరదని గట్టిగా చెప్పేశాడు. కావాలంటే ఫ్యామిలీని చూడాలనిపించినప్పుడు వాళ్ళను ఇక్కడకు పిలిపించుకోమని ఆయన తెలిపినట్లు సమాచారం.
ఇక ఇటీవలె విడుదలైన ఫొటోలలను రాజమౌళి, తారక్ చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. సినిమాలో తారక్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో నటిస్తున్నారు. చరణ్ భార్య పాత్రలో బాలీవుడ్ నటి ఆలియా భట్ నటించనున్నారు. తారక్కు జోడీగా హాలీవుడ్నటి ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. ఈ చిత్ర బడ్జెట్ మొత్తం మూడు వందల కోట్ల ధృవీకరించబడింది. సీత అనే పాత్రలో చెర్రీకి జోడీగా ఆలియా తళుక్కున మెరవబోతుంది. సినిమాలో ఆమెది తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినప్పటికీ ఎంతో ప్రాధాన్యముంటుందని సమాచారం. ఇది పూర్తయిన వెంటనే క్లైమాక్స్ చిత్రీకరణను షురూ చేయనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని దాదాపు 10 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. నూతన ఏడాది కానుకగా ఈ చిత్ర ఫస్ట్లుక్లు బయటకొచ్చే అవకాశాలున్నాయని చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. స్టార్ నటులు ఎన్టీఆర్ – రామ్ చరణ్ గాయాల కారణంగా వాయిదా పడిన ఆర్.ఆర్.ఆర్ షూటింగు ఇటీవలే మళ్లీ మొదలైంది. ఈ చిత్రానికి దర్శకుడు రాజమౌళి. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను పూణేలో ప్లాన్ చేశారు. మొత్తానికి ఇద్దరికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు జక్కన్న. తను అనుకున్న సమయానికి ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని ఇక ఏమాత్రం ఆలస్యం అవ్వకూడదని భావిస్తున్నట్లు సమాచారం.