టాలీవుడ్ కి మెగా మేనల్లుడు గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ... తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని ఏర్పాటుచేసుకుని మాస్ ఆడియన్స్ అందరిని మొదటి సినిమాతోనే మెప్పించిన హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలతో దూసుకుపోయినా  యువ హీరో... ఇక ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు . దీంతో సాయి ధరంతేజ్ కెరీర్ ముగిసిపోయింది అని చాలామంది అనుకున్నారు. కానీ సాయి ధరమ్ తేజ్ కి చిత్రలహరి సినిమాతో మంచి బూస్ట్ అందింది. ఈ సినిమాతో మంచి  విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత తాజాగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతి రోజు పండగే సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. 

 

 

 

 ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతుంది. వసూళ్ళ పరంగా కూడా బాక్సాఫీసును షేక్ చేస్తోంది ప్రతిరోజూ పండగే సినిమా. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా నటించింది. ఇకపోతే ఈ సినిమాలో తన పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో... నటన తో అదరగొట్టాడు సాయి ధరంతేజ్. అయితే తాజాగా దర్శకుడు మారుతి హీరో సాయి ధరమ్ తేజ్ ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన ప్రశ్నలకు పలు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు సాయి ధరమ్ తేజ్. ఈ సందర్భంగా టాలీవుడ్ లో ఆ ముగ్గురు గ్రేట్  డాన్సర్లు  అంటూ సమాధానం ఇచ్చారు. 

 

 

 

 మొదటి నుంచి కూడా తనకు డాన్స్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు సాయి ధరంతేజ్. సినిమాకు సంబంధించి డాన్సుల్లో చిరంజీవిగారి తర్వాతే ఎవరైనా అంటూ సమాధానం చెప్పాడు. ఆయన కాకుండా ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఈ ముగ్గురు కూడా డాన్స్ లతో అదరగొట్టేసారు అని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ డాన్సులకు క్లాసికల్ టచ్ ఎక్కువగా ఉంటుందని... డిఫరెంట్ స్టెప్పులతో  బన్నీ ఆశ్చర్యపరుస్తారూ  అని.. ఇక రామ్ చరణ్ డాన్స్ లో చాలా గ్రేస్  ఫుల్ గా ఉంటాయని సాయి ధరంతేజ్ చెప్పుకొచ్చాడు. నా దృష్టిలో ఈ ముగ్గురు బెస్ట్ డాన్సర్ అంటూ సాయి ధరమ్ తేజ్ తన అభిప్రాయాన్ని ఈ షో వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: