మెగా మేనల్లుడు గా  తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్. మొదటి సినిమాతోనే మాస్ ప్రేక్షకులు అందరినీ ఎంతగానో అలరించి  తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు సాయి ధరంతేజ్. ఇక ఆ తర్వాత వరుస విజయాలను సొంతం చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులు సుప్రీమ్  హీరోగా మారిపోయాడు. అయితే మొదట్లో వరుస విజయాలను అందుకున్న ఈ సుప్రీం హీరో ఆ తర్వాత వరుస పరాజయాలతో అయోమయంలో పడ్డాడు. కానీ చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని అందుకుని మరోసారి రేసులోకి వచ్చాడు ఈ మెగా మేనల్లుడు. ఇక తాజాగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి రోజు పండగే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సరసన రాశిఖన్నా నటించింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే తన తాతను  చివరి క్షణాల్లో  ఆనందంగా ఉంచేందుకు కష్టపడే ఒక మనవడిగా సాయి ధరంతేజ్ ప్రతి రోజు పండగే సినిమా లో ఇరగదీశాడు. 

 

 

 

 ఇక మారుతి ఈ సినిమాలో కామెడీ ని గట్టిగా దట్టించాడు. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ తన కామెడీ టైమింగ్ తో ఎమోషనల్ సీన్ లలో  తన నటనతో అదరగొట్టి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. కాగా ఈ సినిమాతో  మరో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇకపోతే తాజాగా ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హీరో సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండుగే సినిమా  దర్శకుడు మారుతి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు హీరో సాయి ధరంతేజ్,  దర్శకుడు మారుతి. 

 

 

 

 అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సాయి ధరంతేజ్ తాను పెళ్లి చేసుకోనని.. పెళ్లి చేసుకోక పోవడానికి కారణం అదే అంటూ తెలిపాడు. ఇంతకీ ఎందుకు పెళ్లి చేసుకోను అన్నాడు  అంటారా.. దర్శకుడు మారుతి ని వ్యాఖ్యాతగా ఉన్న అలీ మీ సక్సెస్ లో మీ భార్యమనికి  ఎంత భాగం ఇస్తారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి దర్శకుడు మారుతి కాసేపు ఆలోచించారు. దీంతో వెంటనే కలుగజేసుకున్న  సాయి ధరంతేజ్... తాను ఇందుకే పెళ్లి చేసుకోవడం లేదని... పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి ప్రశ్నలే అడుగుతారని తాను పెళ్లి చేసుకోవడం లేదు అంటూ సాయి ధరంతేజ్ తెలిపారు. అంతేకాకుండా నీ పెళ్ళెప్పుడు అంటూ సాయి ధరమ్ తేజ్ ని అలీ  అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ... నేను చేసుకోను అంటూ టక్కున సమాధానం చెప్పేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: