ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యేటటువంటి అనేక షోలలో ప్రతీ శనివారం సుమ యాంకర్ గా చేసే “క్యాష్” కూడా ఒకటి. అయితే ఈ షోకు ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ స్టార్ లు హాజరయ్యి తెలుగు ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్మెంట్ ను అందిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈసారి రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం “వెంకీ మామ” చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఈ షోకి వ‌చ్చారు. దర్శకుడు బాబీ హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ అలాగే విద్యు లేఖ మరియు మంచు లక్ష్మి లు మొట్టమొదటిసారిగా క్యాష్ స్టేజ్ పైకి వచ్చారు.

 


దీనికి సంబంధించిన ప్రోమో టీజర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ ను రాబట్టగా ఇప్పుడు ఫుల్ లెంగ్త్ ప్రోమో బయటకు వచ్చింది. ఈ ప్రోమోలో ఎన్నో విశేషాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా ఈ చిత్రంలోని వెంకటేష్ గారి డైలాగ్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్తే ఎలా ఉంటుందో చూపించాలని బాబీను అడగ్గా బాబీ పవన్ ను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక పాయల్ విషయానికి వస్తే సుమ ఒక ప్రశ్న వేశారు.

 

ఈ ఇద్దరిలో ఏ హీరో సినిమాకు నువ్ ఒకే చెప్తావు అని మొదట ప్రభాస్ పేరు చెప్పగా రెండో పేరు వినకుండానే ప్రభాస్ కు ఓకే చెప్పేసింది. ప్రభాస్ తో సినిమా అయితే ఎప్పుడైనా సరే చేసేస్తానని మొదటి ప్రిఫరెన్స్ డార్లింగ్ కే ఇచ్చింది. ఆ తర్వాతే మిగతా వాళ్ళని చెప్పేసింది. పాపం విజయ్ పేరు కూడా వినలేదు. ఆ తర్వాత సుమ చెప్పాక తెలుసుకుంది. ఎంతో ఎంటర్‌టైనింగ్ గా సాగిన ఈ ప్రోమో అంతకు మించిన ఎంటర్‌టైన్మెంట్ తో ఉండే ఎపిసోడ్ ను చూడాలంటే వచ్చే ఈ డిసెంబర్ 28 శనివారం రాత్రి టెలికాస్ట్ కాబోయే “క్యాష్” లేటెస్ట్ ఎపిసోడ్ ను తప్పక చూసెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: