మెగా హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరంతేజ్ ప్రేక్షకులకు సుప్రీం హీరో గా మారిపోయాడు. తక్కువ సమయంలోనే మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులకు కూడా సంపాదించుకున్నాడు హీరో సాయి ధరమ్ తేజ్. మొదటి సినిమా తోనే మాస్ ప్రేక్షకులను అలరించి మాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు సాయిధరమ్ తేజ్ . కెరీర్ ప్రారంభంలోనే వరుస విజయాలతో దూసుకుపోయారు ఈ హీరో. అయితే మొదట్లో కెరియర్ పరంగా దూసుకుపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం వరుస పరాజయాలతో అయోమయంలో పడిపోయింది సాయిధరమ్ తేజ్ కెరియర్. దీంతో సాయి ధరంతేజ్ పని అయిపోయినట్లే అని అందరూ అనుకున్నారు.
కానీ ఆ తర్వాత చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది . ఇక చిత్రలహరి ఇచ్చిన బూస్ట్ తో మారుతి దర్శకత్వంలో ప్రతిరోజూ పండగే అనే సినిమాల్లో నటించారు సాయి ధరంతేజ్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో సాయి ధరంతేజ్ కెరీర్ గాడిలో పడ్డట్లయింది. ఇకపోతే తాజాగా సాయి ధరంతేజ్ దర్శకుడు మారుతి ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు హీరో.
మీకు ఎలాంటి సినిమాలు రీమేక్ చేయాలని ఉందని వ్యాఖ్యాతగా ఉన్న ఆలీ సాయిధరమ్ తేజ్ ను ప్రశ్నించగా.. పెద్ద మావయ్య చేసిన సినిమాల్లో చంటబ్బాయి సినిమాకు సీక్వెల్ గా చేయలేను కానీ... ఆ జోనర్ లో చేయాలని ఉంది అంటూ సాయి ధరంతేజ్ తెలిపాడు.ఇక చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ చేసిన ఖుషి, తొలి ప్రేమ సినిమాలంటే చాలా ఇష్టమని ఆ తరహా కథలు తనకు చేయాలని ఉంది అంటూ సాయి ధరంతేజ్ తెలిపాడు. ఇకపోతే అటు దర్శకుడు మారుతి ని కూడా ఇలాంటి ప్రశ్నే అడగగా .. తనకి కూడా చంటబ్బాయి లాంటి సినిమా తెరకెక్కించాలని ఉంది అంటూ దర్శకుడు మారుతి తెలిపారు. దీంతో దర్శకుడు మారుతి సాయి ధరంతేజ్ కాంబినేషన్ లో మరో చంటబ్బాయి చిత్రం తెరకెక్కబోతుంది బ్రేకింగ్ రాసుకోండి అంటూ ఆలీ నవ్వుతూ కామెంట్ చేసాడు.