`ఈరోజుల్లో` చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు దర్శకుడు మారుతి. ఆ తర్వాత `బస్ స్టాప్` చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మెగా మేనల్లుడు సాయి తేజ్ తో `ప్రతి రోజూ పండగే` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్నీ అందుకుంది. 

 

 సాయి తేజ్, రాశీ ఖన్నాజంటగా నటించిన `ప్రతి రోజూ పండ‌గే` ఈ ఫ్యామిలీ డ్రామా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలై డీసెంట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా విజయంతో మంచి కిక్ మీద ఉన్న మారుతి తన తర్వాత చిత్రాన్ని ఇస్మార్ట్ హీరో రామ్‌తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మారుతి చేతిలో ముగ్గురు.. నలుగురు నిర్మాతలు వున్నారని.. వాళ్లలో రామ్‌ ఎవరితో ఓకే అంటే వారితో ఆ సినిమాను చేసే ఆలోచనలో మారుతి వున్నాడని అంటున్నాయి సినీ ఇండస్ట్రీ వర్గాలు. కథ గురించి ఆల్రెడీ రామ్‌తో మారుతి మాట్లాడటం జరిగిందనీ, అన్నీ కుదిరి అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. మరోవైపు ఇస్మార్ట్ శంకర్ లాంటి అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్.. తన తదుపరి చిత్రాన్ని కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నాడు. తడం అనే తమిళ సినిమాకు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమా `రెడ్` అనే పేరుతో తెరకెక్కుతోంది.

 

ఇక ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో మంచి మాస్ గుర్తింపు తెచ్చుకున్న రామ్ త‌దుప‌రి చిత్రం ఎలా ఉంబ‌డబోతుందో. మారుతి, రామ్  క‌లిసి రాబోతున్న చిత్రం ఏ జోన‌ర్‌కి సంబంధించింది. ఎలాంటి జోన‌ర్‌లో రామ్‌ను మారుతి చూపించ‌బోతున్నాడ‌న్న విష‌యం తెలియాల్సి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు రామ్ దాదాపుగా మాస్ పాత్ర‌ల్లో ఎక్కువ‌గా న‌టించారు. ఇటు మాస్ ఆడియ‌న్స్, అటు క్లాస్ ఆడియ‌న్స్ ఇద్ద‌రూ మిక్స్‌డ్ ఆడియ‌న్స్ ఉన్నారు రామ్‌కి. ఆల్రెడీ ఒక పెద్ద హిట్ కొట్టి ఉన్నాడు కాబ‌ట్టి త‌న త‌దుప‌రి చిత్రంలో ఆచితూచి అడుగులేస్తాడు రామ్.

మరింత సమాచారం తెలుసుకోండి: