టాలీవుడ్‌లో కొంత మంది డైరెక్ట‌ర్ల క్రేజ్ ఎప్ప‌టికీ పోదు. ఇక పెద్ద డైరెక్ట‌ర్ల విష‌యానికి వ‌స్తే ఇంక అస‌లు చెప్ప‌క్కర్లేదు. వాళ్ళ కోసం ఇటు సీనియ‌ర్ హీరోలు అటు జూనియ‌ర్ హీరోలు ఇద్ద‌రూ వెయిటింగ్‌లోనే ఉంటారు. అలానే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, విక్ట‌రీ వెంక‌టేష్‌లు ఓ సినిమా చేస్తార‌న్న విష‌యం తెలిసిందే. హారిక-హాసిని బ్యానర్‌లో ఈ సినిమా ఉంటుందని స‌మాచారం. అయితే ఈ ప్రాజక్ట్ ప‌ట్టాలెక్కెదెప్పుడు... అన్న విష‌యాలు ఇంకా తెలియాల్సి ఉంది.  అయితే… ఇటీవలే సినిమా షెడ్యూల్ పై ఓ నిర్ణయం తీసుకున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

 

గతంలో వెంకటేష్‌ సినిమాలకు త్రివిక్రమ్ రచయిత‌గా పనిచేశారు. కానీ వెంకీని త్రివిక్రమ్ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ డైరెక్ట్ చేయటం జ‌ర‌గ‌లేదు.  ఇదే మొద‌టి సారి కావ‌డంతో అంత హై ఎక్స్‌పెక్టేషన్‌ నెలకొంది. ఇటీవలే `వెంకీమామ`తో ప్రేక్షకులను నవ్వించిన వెంకీ త్వరలో `అసురన్` రీమేక్ చేయనున్నారు. ఆ తర్వాత మూవీ త్రివిక్రమ్‌తోనే అనే టాక్ బలంగా వినపడుతుంది. వచ్చే ఏడాది మిడిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ప్రచారం సాగుతోంది.

 


మరీ ఇప్పటికైనా అనుకున్న టైంకే సినిమా సెట్స్‌పైకి వెళ్తుందో… ఎప్పటిలాగానే వాయిదాల పర్వం కొనసాగుతుందో చూడాలి. త్రివిక్రమ్ ప్రస్తుతం అల వైకుంఠపురంలో సినిమాతో సంక్రాంతికి రాబోతున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్మూవీ చేస్తారన్న ప్రచారం ఉంది. జనవరి ఎండింగ్‌లో ఈ సినిమా పూజ కార్యక్రమాలు చేసుకోబోతుంది. 

 

మొన్న‌టివ‌ర‌కు ఎన్టీఆర్‌తో త్రివిక్ర‌మ్ త‌రువాత చిత్రం ఉంటుంది అన్నారు. మ‌రి ఇప్పుడేమో సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ లైన్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి చిర‌వ‌రకి త్రివిక్ర‌మ్ ఎవ‌రితో చేస్తాడో తెలియ‌డం లేదు. ఇక ఎన్టీఆర్ తో సినిమా  విష‌యానికి వ‌స్తే వంద‌కోట్ల వ‌సూలు చేస్తుంది. అదే సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ అయితే అంత బిజినెస్ ఉండ‌దు కాబ‌ట్టి కాస్త ఆలోచించాల్సిన విష‌య‌మే మ‌రి.  త్రివిక్ర‌మ్ మ‌రి ఈ విష‌యంలో ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: