బాహుబలి రెండు భాగాల సూపర్ డూపర్ హిట్స్ తరువాత దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఏర్పరుచుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఆ తరువాత భారీ సినిమా సాహో లో నటించారు. ఇక ప్రస్తుతం జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న ప్రభాస్, అతి త్వరలో బాలీవుడ్ లో అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కనున్న మహాభారతం సినిమాలో రావణాసురిడిగా నటించనున్నట్లు నేడు కొన్ని బాలీవుడ్ వర్గాల నుండి వార్తలు వెలువడుతున్నాయి. 

 

మధు మంతెన నిర్మాతగా పలు కార్పొరేట్ కంపెనీలు కలిసి ఈ భారీ సినిమాని రెండు భాగాలుగా తీయనున్నట్లు టాక్. ఇక ఈ సినిమాలో శ్రీకృష్ణుడిగా ముందుగా విలక్షణ నటుడు అమీర్ ఖాన్ ని తీసుకోవాలని భావించారని, అయితే అది కుదరకపోవడంతో ఇటీవల బాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో హృతిక్ రోషన్ ని ఆ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక ద్రౌపదిగా దీపికా పడుకొనే నటిస్తుండగా, ఈ సినిమాలోని కీలకమైన రావణాసురిడి పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని తీసుకోవడానికి నిర్ణయించారట. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నిర్మాతలు ప్రభాస్ ని కలవలేదని, మరికొద్దిరోజుల్లో కలిసి ఆయనకు కథను విన్పిస్తారని అంటున్నారు. 

 

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అత్యంత భారీగా నిర్మితం కానున్న ఈ సినిమా మొదటి భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. వీరితో పాటు మరికొందరు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నటులు నటించబోయే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయని తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా ప్రభాస్ కనుక రావణాసురుడి పాత్రలో నటించడానికి ఒప్పుకుంటే అది ఆయన కెరీర్ కు పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: