బన్నీ త్రివిక్రమ్ తో చేస్తున్న "అల వైకుంఠపురములో" చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఇంకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హారికా హాసినీ పతాకం మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత బన్నీ సుకుమార్ తో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ బన్నీ కోసం స్క్రిప్టు రాసుకుని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాడు. 

 


స్క్రిప్టు పనులు పూర్తి చేసుకుని బన్నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. బన్నీ రాగానే సినిమాని స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్ గా తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్నాడట. ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందట. శేషాచలం అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందట. చిత్తూరు ప్రాంతంలో జరిగే ఈ కథ కోసం చిత్తూరు యాస్ మాట్లాడే వాళ్లని తీసుకుంటున్నాడట. అంతే కాదు కథ అంతా స్మగ్లిమ్గ్ నేపథ్యంలో జరుగుతుంది కాబట్టి కొత్త నటులని తీసుకోవాలని అనుకుంటున్నారట.

 

ఈ కథకి కొత్త వాళ్లయితే నే సూటవుతారని సుకుమార్ భావిస్తున్నరట. అందుకే ప్రస్తుతం కొత్త నటులని వెతికే ప్రయత్నంలో ఉన్నారట. బన్నీ, త్రివిక్రమ్ సినిమా పూర్తి చేసి తన సినిమాకి వచ్చే సరికి డైరెక్ట్ గా షూటింగ్ కే వెళ్ళాలని, అప్పటిలోగా మిగతా పనులన్నింటినీ పూర్తి చేసేసే పనిలో ఉన్నాడట. ఇక ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కబోతుందని తెలుస్తోంది. గతంలో కూడా సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ చిత్రాలను కూడా రివెంజ్ ఫార్ములాతోనే తీశారు. 

 

ఇప్పుడు కూడా బన్నీతో చేయబోయే సినిమా కూడా రివెంజ్ స్టోరీతోనే చేస్తున్నాడు. సుకుమార్ తీసే సినిమాలు ఎంతో వైవిధ్యంతో కూడి ఉంటాయి. మరి ఇప్పుడు స్టైలిష్ స్టార్ తో తీసే ఈ సినిమా కూడా అలాగే ఉంటుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: