యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచి దోస్తులన్న విషయం జగమెరిగిన సత్యం. అందుకే దర్శక దిగ్గజుడు రాజమౌళి తెరకెక్కించే చారిత్రాత్మక చిత్రంలో కలిసి నటించడానికి సై అన్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని వచ్చే సంవత్సరం జూలై 30న  విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.


ప్రస్తుతం అరుకులోయకు దగ్గర్లో ఉన్న అటవీ ప్రాంతంలో ఎన్టీఆర్‌కు సంబంధించిన ఆర్ఆర్ఆర్ చిత్ర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. చిత్ర బృందం అంతా అక్కడే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. అయితే, ఇద్దరు ఆర్.ఆర్.ఆర్ కథానాయకులు సినిమా షూటింగ్ నుంచి విరామం లభించడంతో కొన్ని గంటల పాటు తమ వీరాభిమాని అయిన ఒక మహిళ ఇంటికి వెళ్లారు.

వెళ్లడమే కాదు ఆమెతో కలిసి వీళ్లిద్దరు బ్రేక్ ఫాస్ట్ కూడా చేసారు. అయితే ఇప్పటివరకు ఆమె ఎవరనే విషయం తెలియలేదు కానీ ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఆమెతో దిగిన ఒక సెల్ఫీ ఫొటో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ అభిమాని ఇంట్లో చెర్రీ, ఎన్టీఆర్ తిరుగుతూ వంట గదిలో పనిచేస్తున్న మరొక ఫొటో కూడా అంతర్జాలంలో హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం వీళ్లిద్దరు అభిమాని ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ చేయడం టాలీవుడ్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది.

ఇకపోతే, బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ సీత పాత్రలో రామ్ చరణ్ సరసన నటిస్తుంది. ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ తో జతకట్టనుంది. భారీ అంచనాలు ఉన్న ఈ హై బడ్జెట్ మూవీ రిలీజ్ కోసం అభిమానులు బాగా వేచిచూస్తున్నారు. ఇద్దరు బడా హీరోలను ఒకేసారి చూస్తే ఆ హ్యాపీనెస్ మాటలలో చెప్పలేనిదిిని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: