అభిమాన హీరో వస్తున్నాడంటే అక్కడ మొదలయ్యే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అందులో ప్రిన్స్ మహేష్ వస్తున్నారంటే ఇక పండగే.  ఇదిగో అభిమానులు ఇలా మహేష్ తో పండగ చేసుకుందామను కున్నారు కాని ఇంతలో ఏం జరిగిందో చూడండి.

 

 

లింగంపల్లిలోని ఆలిండ్ ఫ్యాక్టరీ వద్ద అభిమానులతో మహేష్ బాబుకు ఫోటో షూట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు కొందరు నిర్వాహకులు. మహేష్ బాబుతో ఫోటో షూట్‌కు రావాలని ఏకే ఎంటర్ టైన్ మెంట్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఇకపోతే సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’  సినిమా సంక్రాంతికి సందడి చేయనున్న విషయం తెలిసిందే. 

 

 

ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక అయితే మహేష్‌తో ఫోటో అనగానే అభిమానులు అధిక సంఖ్య లో రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అందులో ఈ ఫోటో షూట్ కోసం పోలీస్ పర్మిషన్ కూడా లేకపోవడంతో షూట్ ను చందానగర్ పోలీసులు అడ్డుకున్నారు.

 

 

అప్పటికే షూట్ కోసం అభిమానులు ఎక్కువగా రావడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే సరైన ఏర్పాట్లు లేకపోవడంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు.

 

 

లోపలికి ఒక్కసారిగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని బౌన్సర్లు అడ్డుకోలేపోయారు. భద్రత పూర్తిగా విఫలవం అవ్వడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. ఇద్దరికి కాళ్లు విరిగాయి.

 

 

వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడకు చేరుకున్న మహేష్ షూటింగ్ మధ్యనుంచే వెళ్లిపోయారు. మరోవైపు అభిమానులు,మహిళలపై మహేష్ బౌన్సర్లు దురుసగా ప్రవర్తించారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: