సాయి పల్లవికి తెలుగులో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానమైన క్రేజ్ చాలా తక్కువ సినిమాలతోనే సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఫిదా తర్వాత చేసిన సినిమాలతో సాయి పల్లవి క్రేజ్ అమాంతం  అలా పెరిగిపోయింది. దాంతో ఆమె ఇతర భాషల్లో నటించిన సినిమాలను కూడా ఇప్పుడు తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరో మళయాల సినిమాను కూడా ఇలాగే అనువదిస్తున్నారు. ఈమె ప్రధాన పాత్రలో నటించిన ‘అథిరన్’ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది.

 


ఇక ఇదిలా ఉంటే...నాగచైతన్య-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి లవ్ స్టోరీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ కోసం హైదరాబాద్ పద్మారావు నగర్ లో రెండు సెట్స్ వేశారు. రోడ్డుకు ఇటువైపు అటువైపు ఉండే ఇళ్ల సెట్స్ అవి. ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వస్తూ, గేట్ తీసుకొని సాయిపల్లవి ఇంట్లోకి వెళ్లాలి. ఆ సన్నివేశం అత్యంత సహజంగా ఉండాలి. అందుకే జనాలకు కెమెరా కనిపించకుండా, జనాల మధ్యలోంచి నేచురల్ గా సాయిపల్లవి నడిచి వెళ్లే సీన్ ను తీశాడు కమ్ముల.

 


అయితే  ఇదంతా గ‌మ‌నించిన ఓ వ్య‌క్తి సెలెబ్రెటీలు క‌న‌ప‌డితే మ‌న వాళ్ళు మాములుగా ఊరుకుంటారా.. అందులోనూ సాయిప‌ల్ల‌వి లాంటి క్రేజీ హీరోయిన్ పైగా అది షూటింగ్ అని తెలిశాక అస్స‌లు ఊరుకోరు క‌దా... ఇక పక్కనే రోడ్ సైడ్ హోటల్ లో టిఫిన్ చేస్తున్న వ్యక్తి మాత్రం ఆ సీన్ ను తన కెమెరాలో బంధించాడు. సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

 


గతంలో `విరాటపర్వం` సినిమాకు సంబంధించి కూడా ఇలానే సాయిపల్లవి క్లిప్ ఒకటి వైరల్ అయింది. వరంగల్ జిల్లాలోని ఓ బస్టాండ్ లో సాయిపల్లవి కూర్చున్న సీన్ అది. మేకప్ లేకుండా, సాదాసీదా దుస్తుల్లో సాయిపల్లవి అలా కూర్చునేసరికి ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు. ఈసారి కూడా దాదాపు అలాంటి సీనే తీశాడు కమ్ముల. ఇది ఒక‌ర‌కంగా చెప్పాలంటే సినిమాకి మంచి ప్రమోష‌న్‌గా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. సీన్ లీక్... సీన్ లీక్ అని రావ‌డంతోనే ఇక్క‌డే స‌గం గ‌ట్టి ప్ర‌మోష‌న్ అయిపోతుంది. ఈ మ‌ధ్య ఇలాంటి కొత్త ర‌క‌మ‌యిన ప‌బ్లిసిటీ అయిపోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: