పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎలా సినిమా చేస్తాడనే వార్తలు వస్తున్నప్పటికీ పవన్ నటించబోయే సినిమా పనులు చకచకా జరిగిపోతున్నాయి. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన పింక్ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేస్తున్నారు. పింక్ సినిమాలో బాలీవుడ్ బాద్ షా అమితాబ్ పోషించిన పాత్రని తెలుగులో పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు.

 

ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఎమ్ సీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అయితే ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన అంశం గురించి చర్చ నడుస్తుంది. పవన్ ప్రస్తుతం చాలా సీరియస్ అంశాలతో రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో పవన్ సినిమాకి ఎన్ని రోజులు కేటాయిస్తాడనేది ఆసక్తిగా మారింది. అంతే కాదు ఈ సినిమా కోసం పవన్ రెమ్యునరేషన్ ఎంత తీసుకోనున్నాడనే టాపిక్ కూడా వచ్చింది.

 

అయితే సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్సినిమా కోసం కేవలం 25 రోజులు మాత్రమే కేటాయిస్తాడట. ఈ ఇరవై ఐదు రోజుల కోసం పవన్ కళ్యాణ్ 50కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ కే అంత రెమ్యునరేషన్ ఇస్తే సినిమా ఎంతలో తీయాలి అనే సందేహం కలుగక మానదు. అయితే ఈ సినిమా ఎక్కువ భాగం కోర్టు హాలులో నడుస్తుంది కాబట్టి సినిమాకి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండదనేది టాక్.

 

 

అదీ గాక సినిమాలో నటించే ముగ్గురు అమ్మయిల రెమ్యూనరేషన్ కోటి రూపాయలకు మించదు. దర్శకుడికి కూడా పెద్ద మొత్తంలో ఇవ్వాల్సిన పనిలేదు. అండువల్ల ఈ సినిమాకి పెట్టిన ఖర్చు పవన్ కళ్యాణ్ వల్ల తిరిగి రాబట్టుకోవచ్చని అనుకుంటున్నారట.  పింక్ రీమేక్ బడ్జెట్ లో 75శాతం పవన్ రెమ్యూనరేషన్ ఉన్నా కూడా తన లెక్కలు తనకి ఉన్నాయట. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: