అత్తారింటికి దారేది దాదాపు 40 నిముషాలకు పైగా సినిమా లీకై  చిత్ర యూనిట్ కి చమటలు పట్టించింది. ఇంత కంటెంట్ లీకయ్యాక సినిమా హిట్ అవుతుందా లేదా అన్న టెన్షన్ పడ్డారు చిత్ర బృందం. ఆ తర్వాత కూడా అజ్ఞాత వాసి, సినిమా కూడా ఇలానే జరిగింది. మొన్నామధ్య జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ కూడా ఆన్ లొకేషన్ పిక్ లీకై బాగా వైరల్ అయింది. ఇలా లీక్డ్ వీడియోల పబ్లిసిటీ అంతకంతకు పీక్స్ కి చేరుకుంటోంది. ఏదైనా పబ్లిక్ లో షూటింగ్ చేస్తే ఫ్యాన్స్ అత్యుత్సాహంగా మొబైల్ లో చిత్రీకరించి ఆ వీడియోల్ని సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయడం అవి కాస్తా వైరల్ అయిపోవడం చూస్తున్నదే. ఇంతకుముందు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కరీంనగర్ లోని ఓ రైల్వే స్టేషన్ లో కూర్చొచుని ఉన్నా తనని ఎవరూ పట్టించుకోని దృశ్యం ఫ్యాన్స్ ని ఆశ్చర్య పరిచింది. అంత సహజంగా ఒదిగిపోయి ఆ సీన్ లో నటించేసిందని ఆ తర్వాత తెలుసుకున్న వారికి మరింత సర్ ప్రైజ్ తప్పలేదు.

 

ఈ తరహా ప్రయోగాలు ఇంతకు ముందు తమిళ జనాలు చేసేవారు. పబ్లిక్ లో హిడెన్ కెమెరాలు పెట్టి షూటింగులు చేసేయడం.. హీరో హీరోయిన్స్ సహజంగా ఒదిగి పోయి మార్కెట్ సీన్ల లో నటించేప్పుడు అది షూటింగా కాదా? అన్నది లీకవ్వకుండా జాగ్రత్త పడడం వగైరా వగైరా ప్రయోగాలు తమిళంలో చేశారు. అయినప్పటికి సాంగ్స్ తీసేటప్పుడో లేక యాక్షన్ సీన్స్ తీసేటప్పుడో ..లేక సీన్స్ ని తెరకెక్కించేటప్పుడో అవి కాస్త లీకయ్యి ఇంటర్‌నెట్ లో దర్శనమిస్తున్నాయి. అయితే కొన్ని సార్లు మాత్రం వీటిని చిత్ర యూనిట్ లోని వాళ్ళే తమ వాళ్ళకు లీక్ చేస్తే వాళ్ళు అత్యుత్సాహంతో అక్కడా ఇక్కడా లీక్ చేసి మొత్తానికి సోషల్ మీడియాలో దర్శనమిచ్చేలా చేస్తున్నారు. 

 

అదే తీరుగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల కూడా ప్రయోగాలు చేస్తున్నారట. నాగచైతన్య - సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ప్యామిలీ సెంటిమెంటు ఎమోషనల్ ఎంటర్ టైనర్ ని కాస్త నేచురల్ పంథాలోనే తెరకెక్కిస్తున్నారట. తాజాగా సాయిపల్లవిపై ఓ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. ఇది హైదరాబాద్ పద్మారావ్ నగర్ లో సాగుతోంది. అక్కడ రోడ్ కి అటూ ఇటూ ఇళ్ల సెటప్ ఉంటుంది. ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి వెళ్లే సీన్ అది. జనాలు రోడ్ పై వెళుతున్నా.. ఎంతో సహజంగా సాయి పల్లవి ఆ ఇంటి గేట్ తెరిచి లోనికెళ్లే సీన్ ని తెరకెక్కించారు. అయితే ఎలా లీకైందో ఆ సీన్ లీకైంది. ఎవరో మొబైల్ లో వీడియో తీసి ఆన్ లైన్ లో పెట్టేశారు. దీంతో మరోసారి ఈ వీడియో హాట్ టాపిక్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: