రష్మిక మందన్న, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తవ్వడంతో, ప్రస్తుతం మహేష్ బాబు ఫోటోషూట్ ప్రమోషన్లలో బిజీ గా ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లోని చందానగర్ లో ఆయన తన ఫోటోషూట్ ఈవెంట్ లో పాల్గొనడంతో.. అక్కడికి అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు.

https://mobile.twitter.com/CultSSMBFan_/status/1209779020549611520


అయితే, ఈ ఫోటోషూట్ వద్ద ఒక చిన్న సంఘటన చోటుచేసుకుంది. ముందస్తుగానే పోలీసులకు మహేష్ బాబు ఫొటోస్ షూట్ గురించి పోలీసులకి తెలియజేయకపోవడంతో అక్కడికి వచ్చిన అభిమానులు అదుపులోకి రాలేదు. అదే విధంగా అభిమానులతో మహేష్ బాబు కూడా మొరటుగా ప్రవర్తించాడని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఒక్క సంఘటనతో మహేష్ బాబుకి చెడ్డ పేరు వచ్చిందని నెట్టింట సినీ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.



సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే సినిమాలలో సరిలేరు నీకెవ్వరు తో కొన్ని సినిమాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆయా చిత్రాలలో వేర్వేరుగా నటించిన హీరోల అభిమానుల మధ్య మాటలు యుద్ధం జరుగుతుందని టాక్. ఏ చిన్న సంఘటన దొరికినా.. వారు దానిని హైలైట్ చేస్తూ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ఇలా ప్రతిదీ ఒక పోటీలాగా మారినప్పుడు, మహేష్ బాబు యొక్క ఫోటోషూట్ క్లిప్ ని వైరల్ చేసారు కొంతమంది సినీ అభిమానులను.

https://mobile.twitter.com/CultSSMBFan_/status/1210167224230563841

అప్పుడు, అభిమానుల ఉత్సాహం పరిమితులను దాటినప్పుడు, సరైన క్రమాన్ని పాటించకుండా వారు తమ అభిమాన హీరో దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఈ తరహా సంఘటన ఏ స్టార్ హీరోకైనా జారుతాయని చెప్తూ మహేష్ అభిమానులు కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనలో, ఫోటోషూట్ కోసం టిక్కెట్లు అమ్ముడయ్యాయని ఆరోపిస్తూ, ఇద్దరి కాళ్ళు విరిగాయంటూ ఇతర కథలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.  

 

https://mobile.twitter.com/CultSSMBFan_/status/1209882755871297536

మరింత సమాచారం తెలుసుకోండి: