సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు చాలా ఎక్కువ. ప్రతీ విషయంలోనూ సినిమా వాళ్ళు చాలా పకడ్బందీగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సెంటిమెంటుని వదిలి వేయలేరు. అయితే కొన్ని సార్లు అలాంటి సెంటిమెంట్లు భయాన్ని పుట్టిస్తాయి. ప్రస్తుతం దర్శకుడు మారుతి పరిస్థితి అలాగే ఉంది. మారుతి దర్శకత్వం వహించిన ప్రతి రోజూ పండగే సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.

 

 

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులకి బాగానే ఆకట్టుకుంటుంది. ఈ క్రిస్ మస్ కి విడుదల అయిన అన్ని సినిమాల్లో కెల్ల ఎక్కువ కలెక్షన్లు సాధిస్తున్న చిత్రంగా నిలబడింది. అయితే ఇదిలా ఉంటే దర్శకుడు మారుతికి మాత్రం టెన్షన్ మొదలైంది. ఆయన తర్వాతి సినిమా గురించి అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.

 

 

మారుతికి గత కొన్ని రోజులుగా ఒక సెంటిమెంట్ అడ్డు పడుతూ వస్తుంది. ఏదైనా మంచి బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తే, ఆ వెంటనే వచ్చే సినిమా ఖచ్చితంగా సూపర్ ఫ్లాప్ అవుతుంది. ‘భలే భలే మగాడివోయ్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న మారుతి.. ఆ తర్వాత ‘బాబు బంగారం’తో నిరాశ పరిచాడు.
ఆ తర్వాత కసిగా పని చేసి ‘మహానుభావుడు’తో హిట్ ఇచ్చిన మారుతి.. తర్వాత మళ్లీ అంచనాలు అందుకోలేకపోయాడు. ‘శైలజా రెడ్డి అల్లుడు’తో నిరాశ పరిచాడు. 

 

ఇప్పుడు యధావిధిగా మళ్లీ కసిగా పని చేసి ‘ప్రతి రోజూ పండగే’ సినిమాతో హిట్ కొట్టాడు. మరి దీని తర్వాతి సినిమా పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. మరి తన తర్వాతి సినిమా మిగతా సినిమాల్లా కాకుండా తన సెంటిమెంట్ ని రిపీట్ కానివ్వకుండా చూసుకుంటాడా లేదా అన్నది చూడాలి. మారుతి సెంటిమెంట్ తెలిసీ, అతనితో నటించేవాళ్ళెవరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: