మెగా ఫ్యామిలీ హీరో  సాయి ధరమ్ తేజ్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ హీరో ప్రేమలో పడ్డాడ‌ని.. పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నా రెజీనాతో ప్రేమాలో పడ్డ‌ట్టు సినిమా పరిశ్రమలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ వార్త‌లు రెజీనా కెరియ‌ర్ పైన కూడా ప‌డ్డాయి. సాయి ఫ‌స్ట్ సినిమా పిల్లానువ్వులేని జీవితంలో రెజీనా హీరోయిన్‌. సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్‌సేల్ సినిమాలో కూడా ఈ జంట మ‌రోసారి రిపీట్ అయ్యింది.  ఈ రెండు సినిమాలు హిటే. రెండో సినిమాతో వీరిద్దరు చాలా క్లోజ్ అయ్యారు అని రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా చాలా క్లోజ్‌గా ఉంటున్నార‌ని చెప్పుకున్నారు. కానీ సాయిధ‌ర‌మ్ తేజ్ మాత్రం అలాంటిది ఏమీ లేదంటూ కొట్టి పారేశారు.

 


అయితే మ‌ళ్ళీ రెజీనాతో రిలేషన్ షిప్ పై  మరో సారి క్లారిటీ ఇచ్చారు  సాయిథరమ్ తేజ్. ‘ నా తొలి సినిమాహీరోయిన్ రెజీనా నాకు మంచి ఫ్రెండ్ . నా తొలి  దర్శకుడు, నిర్మాత ఎంత స్పెషలో.. తనూ అంతే  స్పెషల్‌‌. అందుకే కాస్త చనువుగా ఉండేవాడ్ని. అంతకు మించి ఏం లేదు. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యానికి ఏవేవో పేర్లు పెట్టారు . అవి విన్నప్పుడు చాలా బాధనిపించింది. అలాంటి ప్రచారాల వల్ల ఆ అమ్మాయి కెరీర్‌‌ దెబ్బతింటుందని  భయపడి.. సీరియస్‌‌గా తీసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచీ తనతో దూరంగానే ఉంటున్నా. అలాగని పూర్తిగా రిలేషన్ కట్ చేసుకోలేదు. మంచి ఫ్రెండ్ గా తనకెప్పుడూ నాలైఫ్ లో గౌరవం ఉంటుంది‘ అన్నారు.

 

 ఇక ఇటీవ‌లె విడుద‌లైన ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రం సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. క్రిస్మస్ సందర్భంగా సెలవు కావడంతో ఈ చిత్రం ఆ అడ్వాంటేజ్ ను ఫుల్ గా క్యాష్ చేసుకుంది. ఆరో రోజు కూడా మొదటి రోజుకు వచ్చినట్లుగా కలెక్షన్స్ రావడంతో చాలా చోట్ల ప్రతిరోజూ పండగే. బయ్యర్లకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. తెలుగులో ఈ చిత్రం 16 కోట్లకు అమ్ముడుపోగా ఆరు రోజుల్లోనే ఈ చిత్రం 15.36 కోట్లు రాబట్టడం విశేషం. నిన్న ఒక్క రోజే దాదాపు 2.80 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నైజాంలో ఈ సినిమా 5.5 కోట్లకు బిజినెస్ చేయగా, ఇప్పటికే 6.5 కోట్ల షేర్ ను రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: