టాలీవుడ్ లో సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన అనుష్క తర్వాత తెలుగు టాప్ హీరోలతో నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతుంది. ఈ మూవీలో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్, శ్రీనివాస్ అవసరాల , మైకేల్ కీలక పాత్రల్లో నటించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మిస్తున్నారు. భాగమతి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నటిస్తున్న మూవీ కావడంతో ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ఓ మర్డర్ చుట్టూ తిరుగుతుందని.. ఆ మర్డర్ చేసింది ఎవరు? అయితే అనుష్క చిత్రకారిణిగా నటిస్తుందట.. ఆ మర్డర్ కి ఆమెకు ఏంటీ సంబంధం? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని టాలీవుడ్ లో టాక్. హత్యకి సంబంధించిన ముడులు ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్లే తీరు ఆడియన్స్ ను కదలనివ్వదని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరిగింది.
అనుష్క భర్తగా మాధవన్ నటించగా, పోలీస్ ఆఫీసర్ గా అంజలి .. షాలినీ పాండే .. మైఖేల్ మాడిసన్ కనిపించనున్నారు. బాహుబలి సీరీస్ తర్వాత భాగమతి లేడీ ఓరియెంట్ పాత్రలో నటించి మెప్పించింది అనుష్క. అయితే ‘నిశ్శబ్దం’ కూడా ఆమె కెరీర్ లో ది బెస్ట్ మూవీగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటున్నారు.ఇదిలా ఉంటే ఈ మద్య సోషల్ మీడియాలో ముందుగానే కథ లీక్ అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే..అయితే సినిమా చూస్తే కానీ ఏంటీ అన్న విషయం తెలిసిపోతుంది.