జబర్దస్త్ కామెడీ షో నుంచి చాలా మంది ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్లంతా ఇప్పుడు స్టార్స్ అయిపోయారు. ఒకప్పుడు ఎక్కడో ఉన్నాళ్లంతా ఇప్పుడు వెండితెరపై కూడా కనిపిస్తున్నారు. ఇక‌ హైపర్ ఆది.. పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ ద్వారా ప‌రిచ‌య‌మైన ఆది త‌న కంటూ మంచి క్రేజ్ ఏర్ప‌ర్చుకున్నాడు. ఈయన గురించి తెలుసుకోవాలంటే పంచ్ డైలాగులు అని కొడితే చాలు. తన పంచులతో ఎప్పటికప్పుడు కడుపులు చెక్కలు చేయడం ఆదికి అలవాటే. జబర్ధస్త్  ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన హైపర్ ఆది.. ఇప్పుడు ఈ కామెడీ షోలో తిరుగేలేదు. తన ప్రతీ స్కిట్లోనూ పంచులతో నవ్వించే ఆది వెండితెరపై కూడా మ్యాజిక్ చేయడానికి చూస్తున్నాడు.

 

అయితే వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమోలో రోజాను దారుణంగా టార్గెట్ చేసాడు ఆది. స్కిట్‌‌లో భాగంగానే రోజాపై పంచులు కురిపించినా కూడా మరోసారి ఆమె టార్గెట్ అయిపోయింది. రోజా జబర్దస్త్ కాకుండా మరో ప్రోగ్రామ్ కూడా చేస్తుంది రోజా. అదేనంది.. బ‌తుకు జ‌ట్కా బండి. అయితే దానిపై హైపర్ ఆది పంచుల వర్షం కురిపించాడు. ఈయన వేసిన జోకులకు రోజా మొహం తెల్లబడిపోయింది. వచ్చే వారం ప్రోమోలో లేడీ కమెడియన్ గీతా సింగ్‌ను తీసుకొచ్చాడు ఆది. ఆమెను పెళ్లి చేసుకున్నట్లుగా స్కిట్ చేసాడు. 

 

పదండి.. రోజా గారి దగ్గరికి వెళ్దామని గీతా అడిగిన వెంటనే ఇప్పుడే కదా పెళ్లైంది.. అప్పుడే ఆవిడ దగ్గరికి ఎందుకు.. దానికింకా టైమ్ ఉంది అంటూ ఆది పంచ్ వేసాడు. అదేంటి అంటే అదంతే.. ఆమె దగ్గరికి వెళ్ళాలంటే గొడవలు కావాల్సిందే అంటాడు హైపర్ ఆది. ఎందుకు అవుతాయి అంటే అనసూయ కారణంగానే మనిద్దరం వెళ్లి రోజా గారి ముందు కూర్చోవాలంటాడు. ఆమె మధ్యలో ఉంటుంది.. నువ్వోవైపు నేనోవైపు కూర్చుని బాధలు చెప్పుకోవాలంటూ బతుకు జట్కా బండిపై అదిరిపోయే సెటైర్లు వేసి అంద‌రినీ న‌వ్వించాడు. ఇక ఏదేమైనా ఈ మ‌ధ్య కాలంలో రోజాను టార్గెట్ చేసి.. త‌న స్కిట్‌ల‌ను హైలైట్ చేసుకుంటున్నాడు ఆది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: