టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఫుల్, కామెడీ అలానే మాస్ అంశాలు కలగలిపి దర్శకుడు అనిల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే నాలుగు సాంగ్స్, 

 

ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయి సినిమాపై ప్రేక్షకులు, సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు ఏర్పరిచాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 5న ఎంతో గ్రాండ్ గా నిర్వహించనుండగా, ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు. ఇకపోతే మరొక మూడు రోజుల్లో రాబోయే న్యూ ఇయర్ వేడుకను సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీ, వెల్ విషర్స్ తో కలిసి ముంబై లోజరుపుకోనున్నట్లు టాక్. ప్రతి ఏడాది విదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే సూపర్ స్టార్

 

ఈ సారి మాత్రం మరికొద్దిరోజుల్లో తన సినిమా రిలీజ్ ఉండడంతో ముంబై లో ప్లాన్ చేశారట. కావున మరొక రెండు రోజుల్లో ఆయన తన ఫ్యామిలీతో కలిసి ముంబై చేరుకోనున్నారని తెలుస్తోంది. అందుకే మధ్యలో ఎటువంటి కమిట్మెంట్స్ పెట్టుకోకుండా పక్కాగా ప్రణాళిక సిద్ధం చేశారట. మరి తొలిసారిగా మహేష్, అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో రాబోతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే......!!

మరింత సమాచారం తెలుసుకోండి: