ఏ స్టార్ హీరో .. హీరోయిన్ కైనా, నటికైనా నటుడికైనా దర్శకుడికైనా ..ఇతర ఏ టెక్నీషియన్ కి అయినా నంది అవార్డ్ రావడమే గొప్ప విషయంగా భావిస్తుంటారు. ఐతే కొంతమంది మాత్రం ఏకంగా జాతీయ అవార్డ్ సాధించాలని తెగ తాపత్రయ పడుతుంటారు. అందుకోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తుంటారు. ఛాలెంజింగ్ రోల్స్ సెలెక్ట్ చేసుకొని ఎంతో కష్టపడుతుంటారు. కానీ అంత సులభంగా జాతీయ అవార్డ్ దక్కించుకోలేరు. కాని దక్కించుకోవాలనే పట్టుదలతో... దక్కించుకుంటాననే నమ్మకంతో మాత్రం అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళలో నిత్యా మీనన్ ఒకరు.
ఏ రోజుకైనా జాతీయ అవార్డును పొందడమే నా టార్గెట్ అంటోంది నిత్యామీనన్. కమర్షియల్ సినిమాల్లో నటించే ప్రతిభావంతమైన నటీమణుల్లో నిత్యామీనన్ గురించి అందరిలోను ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ మలయాళీ బొద్దుగుమ్మ తెలుగు సినీ ప్రియులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. తెలుగు వాళ్లు హీరోయిన్లలో కోరుకునే ఫీచర్లేమీ లేకపోయినప్పటికి.. నిత్య మాత్రం సక్సెస్ బాగా అయ్యింది. పదేళ్ల నుంచి ఇక్కడ హీరోయిన్ గా కొనసాగుతూ ఉంది. మరీ స్టార్స్ పక్కన నటించలేదు గానీ అవకాశాలు మాత్రం బాగానే అంది పుచ్చుకుంటోంది.
ఇటీవలే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. మిషన్ మంగళ్ సినిమాతో హిందీ పరిశ్రమలో గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి వరకూ నిత్యా మీనన్ కు తీరని కోరిక ఒకటేనట. అది జాతీయ అవార్డు సొంతం చేసుకోవడమే. దాన్ని సాధించడమే లక్ష్యం అని అంటోంది నిత్యా. తనకు ఇంకా బోలెడంత కెరీర్ ఉందని, అప్పుడే ఫేడవుట్ అయిపోలేదని.. ముందు ముందు ఇంకా ఎన్నో సినిమాలు చేసే అవకాశం ఉంది కాబట్టి, వాటిలో దేనితో అయినా తను జాతీయ అవార్డును సొంతం చేసుకోవడం ఖాయమని నిత్యామీనన్ కాన్ఫిడెంట్ గా చెబుతూ ఉంది. అంతేకాదు అందుకోసం మంచి కథలున్న సినిమాలను ఎంచుకుంటున్నట్టుగా కూడా చెబుతోంది.
మరి అవార్డులు కావాలంటే.. ఈ హీరోయిన్ కమర్షియల్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పాలేమో! ప్యారలల్ సినిమాల వైపు అడుగేయాలేమో అంటూ కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇప్పుడు అలాంటి సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్లు కూడా పెద్దగా కనిపించడం లేదు మరి ఎలా నిత్యా. కమర్షియల్ సినిమాల్లోనే కాస్త భిన్న ప్రయత్నాలకు జాతీయ అవార్డులు దక్కుతున్నాయి. మరి ఈ సినిమాలలో నటించి నిత్య ఎప్పుడు పేరు తెచ్చుకుంటుందో. ప్రస్తుతం అమ్మ జయలలిత బయోపిక్ లో నటిస్తోంది నిత్యా. ఈ సినిమాకోసం బాగానే కష్టపడుతోంది.