తెలుగులో ఉన్నటువంటి అగ్ర శ్రేణి హీరోలు అందరిని వెండితెరపై జరిగే పని ఎప్పటికీ కాదు కానీ వారందరిని ఒకే స్టేజి పై నిలబెట్టేది మాత్రం బుల్లితెర అని చెప్పాలి. సినిమా అవార్డ్స్ వేడుకల్లో టాలీవుడ్ అగ్ర శ్రేణి హీరోలు సహా ఇతర హీరోలు కూడా ఒకే స్టేజ్ ను పంచుకుంటారు. అలా ఇప్పుడు మరో గ్రాండ్ ఈవెంట్ సంసిద్ధం అవుతుంది.అదే “సినీ మహోత్సవం”. ఎంతో గ్రాండ్ గా ఈ ఈవెంట్ జరుగుతుందన్న సంగతి అందరికి తెలిసిందే.

 


అయితే ఈసారి ఈ ఈవెంట్ కు జెమినీ టీవీ ప్రాతినిధ్యం వహిస్తుండగా రేపు ఆదివారం టెలికాస్ట్ చెయ్యబోయే ఈ ఈవెంట్ కోసం ఇప్పటి నుంచే వారి వీక్షకులు అలెర్ట్ చేస్తున్నారు. అలా చేస్తూనే ఈ మహోత్సవంలో ఎవరి కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారని ప్రశ్న వెయ్యగా వీక్షకులు అందరి కంటే కూడా మహేష్ కోసమే ఎదురు చూస్తున్నాం అని చెప్తున్నారు. మరికొంత మంది మెగాస్టార్ చిరు కోసం ఆ తర్వాత డార్లింగ్ హీరో ప్రభాస్ కోసం అంటున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్డిసెంబర్ 29 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జెమినీ ఛానెల్ లో ప్రసారం కానుంది. ఇక వీళ్ళంద‌రినీ చూడ‌టానికి ఫ్యాన్స్ రెండు క‌ళ్ళూ చాల‌వ‌నే చెప్పాలి. 

 


ఒకే వేదికపై అంత‌మంది  హీరోయిన్లు  హీరోల డాన్స్‌లు కుర్రాళ్లకు కనులవిందే గ‌తంలో ‘‘సినీ మహోత్సవం.. రథసారథుల రజతోత్సవం’’ పేరుతో టాలీవుడ్‌లో ఒక ఈవెంట్ జరుగుతోంది. చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా మళ్ళీ ఈ ఈవెంట్ గురించి స్పెషల్‌గా చెప్పుకోవాల్సింది ఏముంది అనే డౌట్ రావడం ఖాయమే. ఆ ఈవెంట్ ప్రత్యేకత ఏంటో తెలిస్తే దాని గురించి ఎందుకు స్పెషల్‌గా చెప్పుకోవాల్సి వచ్చిందో అర్థమవుతుంది. గ‌తంలో ఈ ఈవెంట్‌లో రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, రెజీనా లాంటి హీరోయిన్స్ ఆ ఈవెంట్‌లో పెర్ఫార్మ్ చేశారు. అంటే దీని రేంజ్ ఏంటి అనేది అర్థమవుతుంది. ప్రగ్యా జైస్వాల్, ఈషా రెబ్బా, రుక్సార్ ధిల్లాన్ లాంటి క్యూట్ హీరోయిన్స్ కూడా తమ అమేజింగ్ పెర్ఫార్మెన్సెస్‌తో మురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: