ప్రస్తుతం సినీ పరిశ్రమలో వరుసగా వారసులు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ తర్వాత జూ.ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ హీరోలుగా వెండి తెరకు పరిచయం అయి తమ సత్తా చాటుతున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున తర్వాత ఆయన తనయులు నాగ చతన్య, అఖిల్ వచ్చారు.  మంచు ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు, మనోజ్ లు హీరోలుగా ఎంట్రీ ఇస్తే ఆయన కూతురు మంచు లక్ష్మి నటిగా, బుల్లి తెర యాంకర్ గా సత్తా చాటుతుంది.  మెగా స్టార్ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ హీరోలుగా వెండి తెరకు పరిచయం అయి తమ టాలెంట్ చూపిస్తున్నారు.. మాస్ ప్రేక్షకులకు దగ్గర అవుతున్నారు.  

 

స్టార్ హీరో వారసులే కాదు టెక్నికల్, నిర్మాత, దర్శకులు వారసులు కూడా హీరోలుగా పరిచయం అవుతున్నారు.  ఈ నేపథ్యంలో స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు తనయుడు వెంకటేష్ హీరోగా పరిచయం అయ్యారు.  ఆయన తర్వాత డి సురేష్ బాబు తనయుడు రానా హీరోగా పరిచయం అయ్యాడు.  అంతే కాదు స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’తో హీరోగా పరిచయం అయ్యారు.  మనోడు కొన్ని సినిమాల్లో నటించినా సక్సెస్ మాత్రం కలిసి రావడం లేదు.  ఇప్పుడు   చిన్న త‌న‌యుడు సాయిగ‌ణేష్ త్వ‌ర‌లోనే హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడు.  

 

ఈ నేపథ్యంలో  క్రేజీ నిర్మాత‌ల త‌న‌యులు హీరోలుగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.  ఒక‌రు దిల్ రాజు కాంపౌండ్ నుంచి రాబోతుంటే మ‌రో హీరో ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ క్యాంప్ నుంచి రాబోతున్నారు. దిల్ రాజు సోద‌రుడు శిరీష్ త‌న‌యుడు ఆశిష్‌రెడ్డిని హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నారు.  ఈ ఇద్దరు కుర్ర హీరోలు కొత్త దర్శకుడు పరిచయం చేయనున్నారు. అయితే లగడపాటి శ్రీదర్ తనయుడు ఇప్పటికే అల్లు అర్జున్ నటించిన  `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` చిత్రంలో అన్వ‌ర్‌గా కీల‌క పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: