వివి వినాయక్..దర్శకుడుగా అందరికీ పరిచయమే. ఇప్పటి వరకు ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు కూడా. అందులో ఆది, ఠాగూర్, చెన్నకేశవరెడ్డి, అదుర్స్, దిల్ రీసెంట్ గా ఖైదీ నెంబర్ 150 వంటి సినిమాలు వినాయక్ బెస్ట్ సినిమాల్లో కొన్ని అని చెప్పొచ్చు.. ఇక వెండి తెరమీద హీరోయిజాన్ని విలక్షణంగా చూపించే వివి వినాయక్ ఇప్పుడు హీరోగా మారుతున్నాడు. దానికోసమే కొన్ని రోజులుగా దర్శకత్వానికి దూరంగా ఉంటూ , హీరో లుక్ కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు వినాయక్.
మన ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు హీరోలుగా మారారు. ఇప్పుడు నరసింహారావు దర్శకత్వంలో, వివి వినాయక్ కూడా హీరోగా మారాడు. ఈయన సినిమాకు సీనయ్య అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసారు. ఇకపోతే అన్నీ బాగున్నాయి అనుకున్న సమయంలో వినాయక్ కు ఓ చిక్కొచ్చిపడిందట అదేమంటే. దిల్ రాజు బ్యానర్లో మొదలైనా ఈ సినిమా ఆ మధ్య భారీ ఎత్తున ప్రారంభోత్సవం జరుపుకుంది. హైదరాబాద్ లో కొన్ని సన్నివేశాలు కూడా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయిందని టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. దానికి కారణం దిల్ రాజు..
ఈ చిత్రం ఈ స్క్రిప్టుపై రాజు ఏమాత్రం సంతృప్తికరంగా లేడని, అందుకే స్క్రిప్టు మార్చమన్నాడని తెలుస్తోంది. అంత వరకూ ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లే ప్రస్తకే లేదని తెగేసి చెప్పాడట. దాంతో నరసింహారావు కథలో మార్పులు చేర్పులూ చేయడానికి రెడీ అయ్యాడు. అయినప్పటికీ దిల్ రాజు అంచనాలకు తగినట్టుగా ఈ సినిమా లేకపోతే, ఆగిపోవడం ఖాయం అనే గుసగుసలు ఇప్పటికే వ్యాపిస్తున్నాయి..
ఇదిలా ఉండగా ఈ సినిమాపై వినాయక్ చాలా ఆశలు పెట్టుకున్నాడట. అందుకోసం దర్శకత్వం కూడా మానేసి, నటనపై దృష్టి పెట్టాడట. ఈ క్రమంలో తన బరువు కూడా తగ్గాడు. తన స్టైలింగ్ పూర్తిగా మార్చాడు. ఇన్ని చేశాక కూడా సినిమా ఆగిపోతే… అది వినాయక్ కే నష్టం. అందుకే ఇప్పుడు దిక్కుతోచని స్దితిలో ఆలోచనలో పడిపోయాడట వివి వినాయక్.. ఇకపోతే శీనయ్య ముందుకు వెళ్తాడో, లేదో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగవలసిందే అంటున్నారు.