4 రోజుల క్రితం కరీనా కపూర్ తన కుమారుడి పుట్టినరోజు వేడుకలని ఘనంగా నిర్వహించింది. ఆ రోజు తరువాత తన కుమారుడితో మళ్ళీ మీడియా కంట పడింది కరీనా. ఆమె తన కుమారుడు తైమూర్ అలీ ఖాన్‌తో కలిసి బహిరంగ ప్రదేశానికి వచ్చిన ప్రతిసారీ, ప్రజలు వారిని చూడటానికి తెగ ఆరాటపడుతుంటారు. ఇటీవల, బాలీవుడ్ దివా కరీనా కపూర్ ఖాన్ క్రిస్మస్ సందర్భంగా బాంద్రాలోని మౌంట్ మేరీ చర్చి నుండి బయటకు వచ్చేటప్పుడు తైమూర్ అలీ ఖాన్ ను మీడియా వాళ్లు ఫోటోలు తీశారు. ప్రస్తుతం ఈ చిత్రాలు, ఇంకా వీడియోలు నెట్టింట రౌండ్లు చేస్తున్నాయి.

అయితే, కరీనా కాలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ బిచ్చగాడు కూతురిని పట్టించుకోకుండా ఆమె వెళ్ళింది. దాంతో, ఈ బాలీవుడ్ నటిని సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. సమీపంలో నిలబడి ఉన్న లేడీ పోలీసు అధికారి పేద పిల్లని దూరంగా నెట్టారు. దాంతో వారి అసహ్యించుకునే ప్రవర్తనతో అందరిచేత ఛీ అనిపించేలా చేసారని నెటిజన్ల చివాట్లు పెడుతున్నారు.

నెటిజన్లు కరీనా ని ఉద్దేశిస్తూ “ఒక చిన్న పేద అమ్మాయిని పట్టించుకోలేని మానవత్వం లేకపోతే, లక్షల సంపాదించిన, ఎంత స్టార్‌డమ్ ఉన్న వృధానే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కానీసం ఆ పేదపిల్ల వైపు చూసి నవ్వినా, ఆ చిట్టి తల్లి ఆనందపడేది. తైమూర్ కంటే ఓ సంవత్సరం పెద్ద ఉంటుందేమో ఆ బాలిక వయసు. ఇదే పేదవాళ్లకు, ధనవంతులకు ఉన్న తేడా అని నెటిజన్లు అంటున్నారు. ఏదేమైనా ఈ చిత్రం 2019 లో అత్యంత బాధాకరమైనది చెప్పుకోవచ్చు. నెటిజన్లు కరీనా కపూర్్ ఖాన్ ను  బాగా విమర్శిస్తున్నారు కాబట్టి ఆమె కచ్చితంగా ఏదో ఒక సమర్థత ఇస్తుందని తెలుస్తుంది. సో,  కరీనా  ఎటువంటి సమర్థత ఇస్తుందో చుడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: