సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ మధ్య ఏదో రిలేషన్ నడుస్తోందని, వారు అతి త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే వార్తలు కొన్నాళ్లుగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే తమ మధ్య అటువంటిది ఏమి లేదు, మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని వాటిని వారిద్దరూ ఎన్నిసార్లు ఖండించినప్పటికీ కూడా అవి మాత్రం ఆగడం లేదు. తొలుత జబర్దస్త్ షో ద్వారా అక్కడక్కడా కొన్ని స్కిట్స్ లో చిన్న క్యారెక్టర్స్ వేసే సుధీర్, మెల్లగా తన టాలెంట్ తో కష్టపడి పేరు సంపాదించి, ఆ తరువాత అదే షోలో సుడిగాలి సుధీర్ పేరుతో ఒక టీమ్ ని కూడా ఏర్పరుచుకున్నారు. 

 

ఇక ప్రస్తుతం జబర్దస్త్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వారిలో ఒకడిగా సుధీర్ కొనసాగుతున్నాడు. ఇక అదే షో ద్వారా తన అద్భుతమైన యాంకరింగ్ టాలెంట్ తో మంచి పేరు దక్కిచుకున్న యాంకర్ రష్మీ, ఆ తరువాత అక్కడకక్కడ కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఇక ఒక స్కిట్ లో భాగంగా వారిద్దరికీ పెళ్లి జరిగినప్పటి నుండి వారిద్దరి మధ్య ఏదో రహస్య ప్రేమాయణం నడుస్తుందని అనే పుకార్లు మొదలయ్యాయి. ఇకపోతే ప్రస్తుతం సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సుధీర్, నేడు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఆ సినిమా హీరోయిన్ ధన్య బాలకృష్ణ తో కలిసి లైవ్ షో లో పాల్గొన్నాడు. అయితే అదే షో కు సడన్ గా ఫోన్ చేసిన రష్మీ, సుధీర్ వ్యక్తిత్వం, నటనపై మంచి ప్రశంసలు కురిపించింది. 

 

టివి నటుడు నుండి సినిమాల వరకు ఎదిగిన సుధీర్ ప్రస్థానం మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు రష్మీ అన్నారు. అయితే మరి సుధీర్ తో సినిమా ఎప్పుడు చేస్తారు అని అడుగగా, ఆ విషయమై కొన్ని చర్చలు జరుగుతున్నాయి, సుధీర్‌ ప్రస్తుతం ఈ సినిమాతో బీజీగా ఉన్నాడు కదా, రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. అయితే తామిద్దరం కలిసి నటించే ఆ రోజు త్వరగా రావాలని, అది ఎంత త్వరగా జరుగుతుందో చూడాలని రష్మీ అన్నారు. కాగా ఆమె చేసిన వ్యాఖ్యలు నేడు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: