తెలుగు లో వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.  ఏడేళ్ల క్రితం మొదలైన జబర్ధస్త్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే అప్పుడుప్పుడు కొన్ని వివాదాలు వచ్చినప్పటికీ జబర్ధస్త్ స్థాయి ఎప్పుడూ తగ్గలేదు. ఈ మద్య జబర్ధస్త్ నుంచి ఎప్పటి నుంచో జడ్జీగా వ్యవహరిస్తునన నాగబాబు వెళ్లిపోయారు. అయితే జబర్ధస్త్ తో పాపులర్ అయిన ఎంతో మంది నటులు సినిమాల్లోకి వెళ్లారు.  ప్రస్తుతం తెలుగు లో జబర్ధస్త్  కమెడియన్లదే హవా నడుస్తుంది.  ఇక శకలక శంకర్ లాంటి కమెడియన్లు హీరోలుగా మారారు.  ఈ నేపథ్యంలో సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన   ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ నిన్న విడుదలైంది.  రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది.  అయితే సుధీర్ కి మాత్రం మంచి ప్రశసంలు వచ్చాయి.

 

ఫైట్స్, డ్యాన్స్ తో మంచి నటుడుగా మార్కులు కొట్టేశాడు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా సుధీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వెండితెరపై సోలో రోల్ ఫుల్ లెన్త్ లో చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని, ఒకవేళ అలా నటిస్తే తనను చూసేందుకు సినిమా టికెట్లు కొనుక్కుని ప్రేక్షకులు వస్తారని అనుకోలేదని అన్నాడు. తాను జబర్ధస్త్ లోకి వచ్చేముందు ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్స్ తో అందరినీ అలరించేవాడినని.. జబర్ధస్త్ నాకు మంచి వేదిక అయ్యిందని అన్నారు.  

 

జబర్ధస్త్ నాలాంటి కళాకారులకు మంచి వేధిక అని.. ఎంతో మందిని ప్రోత్సహించారని.. ప్రస్తుతం వెండితెరపై తమ సత్తా చాటుతున్నారని అన్నారు. ఒకప్పుడు చిరంజీవి, పవన్ కల్యాణ్.. పెద్ద హీరోల సినిమాలు చూసేందుకు వెళ్లినప్పుడు పేపరు ముక్కలను థియేటర్ లో విసిరివేసేవాడినని, అలాంటిది  తాను నటించిన సినిమాను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఇదేవిధంగా చేయడం ఊహించలేకపోతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: