అనీల్ రావిపూడి ఇప్పుడు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ దర్శకుడు.... మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్... ప్రస్తుతం ఇపుడు మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరూ సినిమాకి డైరెక్టర్ గా చేస్తున్నారు....సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అనీల్ రావిపూడి, దేవిశ్రీ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఇది.. ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి..

 

సినిమా జనవరి 11 న సంక్రాంతి కానుకగా మన మందికి రాబోతుంది... అనీల్ రావిపూడి 2019లో ‘ఎఫ్2’ సినిమాతో ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా విజయంతో స్టార్ నిర్మాతలు, హీరోల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.అలానే మహేష్ బాబు కి కధ చేపిన వెంటనే ఓకే చేసేసారు.... అంతలా సూపర్ స్టార్ ని మెప్పించాడు అనీల్...

 

 


ఈనెల 28న నిర్వహించిన విశాఖ ఉత్సవ్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సినిమాలోని ‘డాంగ్ డాంగ్’ సాంగ్ ప్రోమోను విశాఖ ఉత్సవ్‌లో విడుదల చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ ప్రోమోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ పాటకు వీరంతా స్టేజ్‌పై డాన్స్ చేసి సందడి చేసారు...

 

 

అయితే సరిలేరు నీకెవ్వరూ సినిమాని విశాఖపట్నం లో నిర్వహించడానికి ఒక కారణం ఉంది... డైరెక్టర్ అనీల్ రావిపూడికి విశాఖ ఉత్సవ్ బాగా కలిసి వచ్చిందంట... కిందటేడాది సంక్రాంతికి వచ్చిన అనిల్ రావిపూడి చిత్రం ‘ఎఫ్2’ ఆడియో విడుదల కార్యక్రమాన్ని కూడా విశాఖ ఉత్సవ్‌లో నిర్వహించారు.

 

సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రమోషన్స్ ని కూడా విశాఖ ఉత్సవ్ తో స్టార్ట్ చేసారు.. ఒక సాంగ్ కూడా రిలీజ్ చేసారు... చూడాలి మరి అనీల్ రావిపూడి సెంటిమెంట్ ఈ సినిమా విషయంలో ఎలాంటి విజయం ఇస్తుందో....





మరింత సమాచారం తెలుసుకోండి: