టాలీవుడ్ లోకి కెరటం మూవీతో హీరోయిన్ గా పరిచయం అయిన నటి రకూల్ ప్రీత్ సింగ్ ఈ మూవీ ఫ్లాప్ తో ఢీలా పడ్డ సమయంలో సందీప్ కిషన్ నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీతో మంచి విజయం అందుకుంది. గత కొంత కాలంగా బాలీవుడ్ మోడల్స్, నటిమణులు తెలుగు తళుక్కున మెరిసి కనిపించకుండా పోయారు.  కానీ రకూల్ ప్రీత్ సింగ్ మాత్రం వరుస విజయాలు అందుకుంటూ తెలుగు టాప్ హీరోల సరసన నటించింది.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న ఈ పంజాబీ అమ్మాయి.. హైదరాబాద్ లోనే స్థిరపడింది.  పలు వ్యాపారాలు కూడా చేస్తుంది. ముఖ్యంగా ఈ అమ్మడు హైదరాబాద్ లో ప్రారంభించిన జిమ్ కి మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. పలువురు సెలబ్రెటీలు రకూల్ వ్యాయమశాలకు వస్తుంటారు.   

 

అయితే ఫిట్ నెస్ పై ఎక్కువగా శ్రద్ద చూపించే రకూల్ ప్రీత్ సింగ్ యోగా, జిమ్ తో బిజీగా ఉంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు వర్క్ అవుట్ చేస్తున్న వీడియోలు, ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ పోస్టు చేస్తూ.. అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఛాన్స్ దొరికినా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని చెబుతూ ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జిమ్‌లో వర్కవుట్‌కు సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు. అంతే కాదు ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలకైనా రకూల్ ముందుంటారు.

 

ఇటీవల నాగార్జున హీరోగా నటించిన  మన్మథుడు 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం భారతీయుడు 2లో ఆమె నటిస్తున్నారు.  తాజాగా యోగి చేస్తూ వివిధ భంగిమల్లో ఉన్న ఫోటోలను రకుల్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.  ప్రస్తుతం ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో అవకాశాలు లేక బాలీవుడ్, కోలీవుడ్ లో ఛాన్సులు దక్కించుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: