మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "సరిలేరు నీకెవ్వరు" చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమొషన్లలో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. మాస్ మసాలా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
అనిల్ రావిపుడి సినిమాల్లో వినోదం ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోనూ వినోదానికి ఏ ఢోకా ఉండదట. ఇప్పటికే రిలీజైన టిజర్, పాటలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అన్ని పాటల్లో కెల్లా ఎక్కువ ఆకర్షించిన పాట మాత్రం డాంగ్ డాంగ్ అనే చెప్పాలి. ఇప్పటికే ఈ పాట ప్రీ టీజర్ ని రిలీజ్ చేసింది. తమన్నా స్పెషల్ల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్న ఈ పాటలో మహేష్ వేసిన స్టెప్పులు టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాయి.
స్వతహాగా మహేష్ మంచి డాన్సరే కానీ గత కొన్ని రోజులుగా చాలా బద్ధకం చూపిస్తున్నాడు. ఎంత ఈజీగా స్టెప్స్ వేసేసామనిపించుకుంటే అంత సుఖమన్నట్టుగా కొన్ని అనవసర స్టెప్పులు వేసి ట్రోలింగ్కి గురయ్యాడు. బ్రహ్మోత్సవం సినిమాలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలోనూ ఈజీ స్టెప్స్ వేయాలని అనుకున్నాడట. కానీ అనిల్ రావిపూడి ససేమిరా ఒప్పుకోలేదట.
దర్శకుడు అంతగా అడగడంతో మహేష్ కూడా కాదనలేకపోయాడు. ఈ చిత్రంలో డాంగ్ డాంగ్ మాత్రమే కాదు... మైండ్ బ్లాక్ పాటలోను మహేష్ డాన్స్లు అదరగొట్టేసినట్టు టాక్. ఈ రెండు పాటలు అభిమానులకి పూనకాలని తెప్పిస్తాయట. మొత్తానికి మహేష్ చేత అదిరిపోయే స్టెప్పులు వేయించి అభిమానులకి పసందైన విందు ఇచ్చిన ఘనత అనిల్ కే దక్కుతుంది.