టాలీవుడ్ లో నాగ శౌర్య నటించిన ‘ఛలో ’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. కిర్రాక్ పార్టీ మూవీతో కన్నడంలో హీరోయిన్ గా పరిచయం అయిన రష్మిక మందన్న ఆ మూవీతో రక్షిత్ శెట్టితో కలిసి నటించింది. ఆ తర్వాత ఈ జంటకు నిశ్చితార్థం వరకు వచ్చి క్యాన్సల్ అయ్యింది. ఛలో మూవీ మంచి విజయం అందుకోవడంతో రష్మికకు తెలుగులో మంచి ఛాన్సులు రావడం మొదలయ్యాయి. పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీతా గోవిందం’ మూవీలో హీరోయిన్ గా నటించిన రష్మిక గోల్డెన్ హిట్ అందుకుంది.
ఆ తర్వాత తెలుగు లో వరుసగా ఛాన్సులు రావడంతో ఈ అమ్మడి అదృష్టం బాగా కలిసి వచ్చింది. వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడుపుతుంది. విజయ్ దేవరకొండతో ‘డీయర్ కామ్రెడ్’ మూవీలో నటించినప్పటికీ అది పెద్దగా హిట్ కాలేదు. కన్నడ అమ్మాయి అయినా.. తెలుగు బాగా నేర్చుకుంటుంది. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తుంది. ఆ తరువాత ఫిబ్రవరి లో నితిన్ హీరోగా వస్తున్న భీష్మ సినిమాతో సందడి చేయనుంది. మరో వైపు అల్లుఅర్జున్, సుకుమార్ కాబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా రశ్మికనే నటించనుందని సమాచారం.
ఈ మూవీపై రష్మిక భారీ అంచనాలే పెట్టుకుంది. ఇలా వరుస మూవీస్ తో ప్రస్తుతం ఈ అమ్మడు టాప్ లో నిలిచింది. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడతాననే నమ్మకంతో ఉందట రష్మిక. ఒకవేళ ఆ సినిమా హిట్ కొడితే టాలీవుడ్ లో రష్మిక ప్లేస్ మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఆ క్రేజ్ ఉపయోగించుకొని రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎన్నో కండీషన్లు పెడుతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అవునులే.. గ్లామర్ ఉన్నపుడే కాస్త డబ్బు వెనుకేసుకోవాలని మిగతా హీరోయిన్లను చూసి రష్మిక కూడా అదే బాటలో నడుస్తుందని అంటున్నారు ఫిలిమ్ వర్గాలు.