సతీష్ వేగేశ్న దర్శకత్వంలో, నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్గా ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సినిమా ఎంతమంచివాడవురా... ఇకపోతే ‘118’ చిత్రంతో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి 'శతమానం భవతి' అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైయ్యాడు..
ఇకపోతే ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 15న విడుదల చేయడానికి చిత్రబృందం సన్నహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను జనవరి 8న హైదరాబాద్లో నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. అంతే కాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ హాజరవుతారని సమాచారం.
ఇక ఇటీవలే సినిమా షూటింగ్ మొత్తం ముగియడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. ఇక 'శతమానం భవతి' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సతీష్ వేగేశ్న.. ఆ తరువాత నితిన్ హీరోయిగా ‘శ్రీనివాస కళ్యాణం’ రూపొందించి బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టేందుకు కళ్యాణ్ రామ్తో కలిసి ఎంతమంచివాడవురా అంటూ ఎంటర్టైన్ చేయబోతున్నారు.
ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. జనవరి 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరీ ఈ క్రేజీ కాంబో మూవీ ఎలాంటి టాక్ను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి..