టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక ప్రత్యేక పాత్రలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు అత్యంత భారీగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ సినిమా పై విపరీతంగా అంచనాలు ఏర్పరచడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా విషయమై నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది. 

 

అదేమిటంటే, గతంలో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమాల్లో ఎఫ్2 సినిమా సెకండ్ హాఫ్ పరంగా కొంత విమర్శలు  ఎదుర్కొందని, నిజానికి అనిల్ రావిపూడి సినిమాల్లో ఫస్ట్ హాఫ్ లో ఉండే ఎంటర్టైన్మెంట్ సెకండ్ హాఫ్ లో ఉండదని కొందరు విమర్శలు చేస్తున్నారట. అయితే ఎఫ్ 2 అంత పెద్ద హిట్ అవడానికి, అప్పట్లో ఆ సినిమాకు మరొక సినిమా పోటీ లేకపోవడమేనని, ఇక ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతున్న సరిలేరు సినిమా విషయంలో కూడా ఒకవేళ సెకండ్ హాఫ్ కొంత నెమ్మదిస్తే మాత్రం కష్టమేనని అంటున్నారు. ఎందుకంటే ఈ బాక్సాఫీస్ బరిలో అలవైకుంఠపురములో

 

దర్బార్, ఎంత మంచివాడవురా సినిమాలు కూడా ఉండడంతో ఏ మాత్రం తేడా వచ్చినా అది సరిలేరు కలెక్షన్స్ పై ఎంతో ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే దీనిపై కొందరు సినీ విశ్లేషకులు స్పందిస్తూ, ప్రస్తతం మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా సెకండ్ హాఫ్ విషయమై ప్రచారం అవుతున్న వార్తలో నిజానిజాలు మనకు తెలియవని, ఎందుకంటే, పూర్తిగా సినిమా చూసేదాకా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందో, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం అని, కాబట్టి అటువంటి పుకార్లను పట్టించుకోవలసిన అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు. జనవరి 11 న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోత్బున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: