ప్రతి సంవత్సరం తెలుగు ప్రేక్షకులందరికీ టాలీవుడ్ లో  ఎన్నో మధురమైన అద్భుతమైన సినిమాలను అందిస్తుంది. ఈ క్రమంలోనే 2019 సంవత్సరంలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించింది టాలీవుడ్. 2019 సంవత్సరంలో టాలీవుడ్ ఖ్యాతిని  ప్రపంచం నలుమూలలా వ్యాపించిన సినిమాలు ఎన్నో. 2019 సంవత్సరంలో తెలుగు ప్రేక్షకులను ఎన్నో సినిమాలు వచ్చి అలరించాయి ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇలాంటి చిత్రాల్లో టాప్ 3 ఈ చిత్రాలు ఏంటో తెలుసుకుందాం. 

 

 

 

 విక్టరీ వెంకటేష్ మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2 సినిమా ఈ ఏడాది శుభారంభం చేసింది. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు అందరినీ కడుపుబ్బ నవ్వించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక విభిన్నమైన కథాంశంతో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో ఆకర్షించి  2019 లో  తెలుగు చిత్ర పరిశ్రమకు శుభారంభాన్ని ఇచ్చింది. ఇక ఆ తర్వాత మే నెలలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహర్శి సినిమా  భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటికె  వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరిపోయింది. 

 

 

 

 విద్యార్థి దశ నుంచే సక్సెస్ కోసం పరుగులు పెట్టే యువకుడిగా మహేష్ బాబు తన నటనతో ఆకట్టుకుని  తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. అంతేకాకుండా  దేశంలో రైతన్న ఎన్ని కష్టాలు పడుతున్నారనేది  కళ్లకు కట్టినట్లు చూపించి  మహర్షి సినిమా తో అందరిలో చైతన్యం కలిగించాడు  మహేష్ బాబు. అప్పట్లో ఈ సినిమా పెద్ద సంచలనమే సృష్టించింది. ఎంతో మంది ఎన్నారైలు సైతం పంట పొలాల్లోకి వెళ్లి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇది ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత భారీ అంచనాల మధ్య యాక్షన్ థ్రిల్లర్ గా విడుదలైన ప్రభాస్ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాపై రూమర్లు వచ్చినప్పటికీ... దేశ వ్యాప్తంగా ఈ సినిమా సంచలనమే సృష్టించింది. వసూళ్ళ పరంగా కూడా టాలీవుడ్ లో ప్రస్తుతం 2019 సంవత్సరంలో ఈ సినిమానే టాప్ ప్లేస్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: