చూస్తూ ఉండగానే అప్పుడే 2019 సంవత్సరం రావడం, అలానే రేపటితో ఈ ఏడాది ముగియడం జరిగిపోతోంది. ఇక గడిచిన ఈ ఏడాది కాలంలో ఎన్నో సినిమాలు మన ముందుకు వచ్చాయి, వాటిలో కొన్ని హిట్ కాగా మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే ఏ సినిమాకైనా ముందుగా రిలీజ్ చేసే ఆడియో కనుక సక్సెస్ అయితే, అది కొంతవరకు సినిమా విజయానికి దోహదం చేస్తుంది అనేది అందరికీ తెలిసిందే. ఇక ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా ఆడియన్స్ మెచ్చిన బెస్ట్ ఫైవ్ సాంగ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.....!!

 

1. సామజవరాగమనా (అలవైకుంఠపురములో) -  అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబోలో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో సినిమాలోని ఈ సాంగ్ కు శ్రోతల నుండి విశేషమైన స్పందన లభించింది. యువ సంచలన గాయకుడు సిద్ శ్రీరామ్ అలిపించిన ఈ సాంగ్ కు ఎస్ ఎస్ థమన్ అద్భుతమైన బాణీని అందించాడు. ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అందించిన సాహిత్యం, ఈ సాంగ్ కు మరింతగా వన్నె తెచ్చింది. దాదాపుగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ తో 1 మిలియన్ లైక్స్ తో ఇప్పటికే ఈ సాంగ్ యువతను విశేషంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 

 

2. రాములో రాములా (అలవైకుంఠపురములో) - ఈ సాంగ్ కూడా యూట్యూబ్ లో 100 మిలియన్ పైగా వ్యూస్ ని అందుకుని ఇంకా మంచి ఆదరణతో ముందుకు సాగుతోంది. ఫోక్ స్టైల్ లో సాగే ఈ సాంగ్ కు యువ గాయకులు అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఇద్దరూ కూడా ఈ సాంగ్ ని ఎంతో అద్భుతంగా ఆలపించారు. ఇక ఈ సాంగ్ కు మధ్యలో వచ్చే గిటార్ ర్యాప్, మొత్తం పాటకే ఎంతో హైలైట్. థమన్ అందించిన బ్యూటిఫుల్ ట్యూన్ కు కాసర్ల శ్యామ్ ఎంతో సుమధుర సాహిత్యాన్ని అందించారు. 

 

3. ఇదే కదా ఇదే కదా (మహర్షి) - సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లీ దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమాలోని ఈ సాంగ్, హీరో యొక్క గొప్పతనాన్ని తెలుపుతుంది. ఈ సాంగ్ ని విజయ్ ప్రకాష్ ఎంతో హృద్యంగా ఆలపించారు. దేవిశ్రీప్రసాద్ అందించిన ట్యూన్ కి శ్రీమణి అందించిన లిరిక్స్ మరింత ఆకర్షణనిచ్చాయి. 

 

4. దిమాక్ ఖరాబ్ (ఇస్మార్ట్ శంకర్) - ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని అన్ని పాటలు మంచి హిట్ సాధించగా, మణిశర్మ స్వరపరిచిన మాస్ సాంగ్ అయిన దిమాక్ ఖరాబ్ సాంగ్ కు యూత్, మాస్ ఎంతో కనెక్ట్ అయ్యారు. కీర్తన శర్మ, సాకేత్ ఈ సాంగ్ కి ఆలపించడం జరిగింది. ఇక యూట్యూబ్ లో కూడా ఈ సాంగ్ కు విపరీతంగా లైక్స్ రావడం జరిగింది. 

 

5. ఏ చోట నువ్వున్నా (సాహో) - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన భారీ బడ్జెట్ మూవీ సాహో. ఈ సినిమాలోని గురు రంధావా స్వరపరిచిన ఏ చోట నువ్వున్నా అనే మెలోడియస్ సాంగ్ కు యూత్ కు ఎంతో కనెక్ట్ అయ్యారు. హరిచారం శేషాద్రి, తులసి కుమార్ ఆలపించిన ఈ సాంగ్ విజువల్ గా కూడా ఎంతో అదరగొట్టింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: